Uttarakhand: ఉత్తరాఖండ్లో ప్రమాద స్థాయిని దాటిన నదులు.. 100 రోడ్లు మూసివేత
- ఉత్తరాఖండ్లో భారీగా కురుస్తున్న వర్షాలు
- ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న నదులు
- రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
Uttarakhand: గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 100కు పైగా రోడ్లు మూసుకుపోయాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పితోరాఘర్, ఉధంసింగ్ నగర్, కుమావోన్లతో పాటు అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అంచనా వేసింది. డెహ్రాడూన్, పౌరీ, తెహ్రీ, హరిద్వార్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Read Also: Thief Letter : చిలిపి దొంగ.. అమ్మకు బాగాలేదు, లవర్ పుట్టిన రోజు అంటూ లెటర్ పెట్టి ఏకంగా..?
Also Read
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
- Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీటిమట్టం పెరగడంతో 100కు పైగా రహదారులు మూసుకుపోయాయి. గడిచిన 24 గంటల్లో అల్మోరాలోని చౌఖుటియాలో 72.5, భన్సియాచానాలో 62, లోహాఘాట్లో 59, చంపావత్లో 45, కాశీపూర్లో 42, భీమ్తాల్లో 38, హల్ద్వానీలో 31, చమోలీలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది ఉప్పొంగడంతో 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. నీటి ఎద్దడి కారణంగా లోతట్టు ప్రాంతాలకు లేదా నదీ తీరాలకు వెళ్లవద్దని వాతావరణ, విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
పౌరీ, నైనిటాల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వేతర పాఠశాలలు మూసివేయబడ్డాయి. విపత్తు సంభవించినప్పుడు తక్షణమే రక్షించడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా మేజిస్ట్రేట్లకు సూచించబడింది. విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జాతీయ విపత్తు రెస్క్యూ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గంగ, సరయూ ప్రమాదకర స్థాయికి కొన్ని మీటర్ల దిగువన ప్రవహిస్తుండగా అలకనంద, మందకాని, భాగీరథి నదులు ప్రమాద స్థాయిని దాటాయి. గోమతి, కాళీ, గౌరీ, శారదా నదుల నీటిమట్టం కూడా పెరుగుతోంది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై పీపాల్ కోఠి సమీపంలోని పాగల్ నల్, మాల్వాకు వెళ్లే రహదారి కొండచరియలు విరిగిపడటంతో మూసుకుపోయింది. యమునోత్రి హైవే, ధార్చుల, తవా ఘాట్ జాతీయ రహదారిపై కూడా రోడ్లు మూసుకుపోయాయి.
తాజావార్తలు
-
Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
-
Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
-
Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
-
Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
-
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!