India Not A Nation: “భారత్ ఒక దేశం కాదు”.. డీఎంకే నేత రాజా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Not A Nation: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి డీఎంకే సీనియర్ నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాజా.. తాజాగా ‘‘ఇండియా ఒక దేశం కాదు’’ అని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని చెప్పింది. రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటేని ప్రశ్నించగా.. అతని వ్యాఖ్యలతో తాను 100 శాతం ఏకీభవించనని అన్నారు. రాముడు అందరికీ చెందిన వాడని, అందరినీ కలుపుకుని పోయేవాడని నేను నమ్ముతానని అన్నారు. ఇండియా కూటమిలో ఆర్జేడీ పార్టీ చీఫ్ తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇది అతని వ్యక్తిగత ప్రకటన అని, ఇది కూటమిని ఉద్దేశించవని అన్నారు.
Also Read
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజా ప్రసంగిస్తూ.. ‘‘భారతదేశం ఒక దేశం కాదు, దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతిని సూచిస్తుంది. ఇలాంటి లక్షణాలు మాత్రమే ఒక దేశాన్ని తయారు చేస్తాయి. తమిళనాడుకు వస్తే, ఒక సంస్కృతి ఉంది, కేరళలో, మరొక సంస్కృతి ఉంది, ఢిల్లీలో మరొకటి ఉంది.’’ అంటూ వ్యాఖ్యానించారు. జైశ్రీరాం, భారత్ మాతాకీ జై అనే నినాదాలను మేము ఎప్పటికీ అంగీకరించబోమని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. డీఎంకే ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరంతరం కొనసాగుతున్నాయని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చాడని, ఇప్పుడు భారతదేశాన్ని ‘‘బాల్కనైజేషన్’’ చేయాలని ఆ పార్టీ నేత ఏ రాజా పిలుపునిస్తున్నాడని, భగవాన్ రామ్ని అవహేళన చేస్తున్నాడని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్, ఇండి కూటమి ఈ వ్యాఖ్యల్ని అంగీకరిస్తుందా..? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!