Sharwanand: శర్వాని కాపాడేది ఎవరు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్… మంచి నటుడే… కానీ హీరోగా సరైన హిట్ పడటం లేదు. 2017లో వచ్చిన ‘శతమానం భవతి’ తర్వాత మరో సాలీడ్ హిట్ శర్వా ఖాతాలో లేదు. ‘మహానుభావుడు’ పర్వాలేదనిపించినా ‘రాధ, పడిపడిలేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం’ వంటి సినిమాలు శర్వానంద్ మార్కెట్ ను భారీ స్థాయిలో దెబ్బ తీశాయి. దాంతో నటుడుగా శర్వానంద్ సామర్ధ్యం కంటే ప్యాడింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టవలసిన స్థితి ఏర్పడింది. దాంతో శర్వా తాజా చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ పూర్తి స్థాయిలో భారీ ప్యాడింగ్ తో రూపొంది విడుదలకు సిద్ధం అయింది.
నిజానికి ఈ సినిమాను వెంకటేశ్, నిత్యామీనన్ తో తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు కిశోర్ తిరుమల. ఏమైందో ఏమో కానీ కొంత కాలం పెండింగ్ లో పడిన ఈ ప్రాజెక్ట్ చివరకు శర్వానంద్ తో మొదలైంది. లక్కీగా ఫుల్ ఫామ్ లో ఉన్న రశ్మిక హీరోయిన్ గా ఎంపిక కావటంతో ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది.
కిశోర్ తిరుమలకు ‘నేను శైలజ’తో దర్శకుడుగా గుర్తింపు వచ్చింది. అంతకు ముందు తమిళంలో ఓ సినిమా, తెలుగులో సెకండ్ హ్యాండ్ సినిమా డైరెక్ట్ చేసినా తగిన గుర్తింపు దక్కలేదు. ‘నేను శైలజ’ హిట్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన కిశోర్ ఆ తర్వాత ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’ వంటి సినిమాలు చేశాడు. అవేవీ ‘నేను శైలజ’లా పేరు తెచ్చిపెట్టలేక పోయాయి. ఇప్పుడు శర్వానంద్ తో పాటు కిశోర్ ఆశలు కూడా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ పైనే ఉన్నాయి. ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఇంతకు ముందు శర్వానంద్ తో ‘పడిపడి లేచె మనసు’ సినిమాను ప్రసాద్ చుక్కపల్లితో కలసి నిర్మించారు. ఆ సినిమాలో భారీ నష్టాలు వచ్చినా ధైర్యంగా ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాను శర్వానంద్ మార్కెట్ కి అతీతంగా భారీ ఖర్చుతో నిర్మించారు.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
మార్చి 4న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి శర్వానంద్ కి ఈ సినిమా ద్వారా హిట్ ఇచ్చేది ఎవరు!? కిశోర్ తిరుమల కథనా? దేవిశ్రీ ప్రసాద్ సంగీతమా!? రశ్మిక మందన్న లక్ నా? లేక సుధాకర్ చెరుకూరి తెంపరితనమా!? ఏది శర్వానంద్ ని మార్కెట్ లో హీరోగా నిలబెడతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. శర్వాకి కలసి వచ్చే అంశం ఏమిటో మార్చి 4న తేలనుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..