Rahul Gandhi: ప్రభుత్వం మారితే వారిపై చర్యలు, ఇదే నా హామీ.. రాహుల్ గాంధీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ రూ. 1800 కోట్లు ఫైన్ కట్టాలని ఇన్కమ్ టాక్స్ నోటీసులు అందుకున్న తర్వాత దీనిని ‘‘టాక్స్ టెర్రరిజం’’గా ఆరోపించింది. ‘‘ ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి మళ్లీ చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది నా హామీ’’ అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ హెచ్చరించారు.
Also Read
- Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
- Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో 'వీరాధి వీరులు'
- Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? 'జైలర్ 2' తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
- Allu Arjun : అల్లుఅర్జున్ 'రాకా' 2027లో రావడం కూడా కష్టమేనా.?
ఐటీ శాఖ రూ. 200 కోట్ల జరిమానా విధించడంతో ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా నోటీసులు మరింత ఇబ్బందికి గురిచేశాయి. హైకోర్టు ఈ కేసులో ఎలాంటి ఉపశమనం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది.
ఐటీ శాఖ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బీజేపీ గత కొన్నేళ్లుగా వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్ను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. బీజేపీ ఆదాయ పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆ పార్టీ నుంచి రూ. 4617.58 కోట్ల డిమాండ్ని సేకరించాలని ఐటీని కోరారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రైడ్ లంచాలు, షెల్ కంపెనీలను ఉపయోగించి ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ద్వారా బీజేపీ రూ. 8200 కోట్లు వసూలు చేసిందని జైరాం రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
తాజావార్తలు
-
Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
-
Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!