Rahul Gandhi: ప్రభుత్వం మారితే వారిపై చర్యలు, ఇదే నా హామీ.. రాహుల్ గాంధీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ రూ. 1800 కోట్లు ఫైన్ కట్టాలని ఇన్కమ్ టాక్స్ నోటీసులు అందుకున్న తర్వాత దీనిని ‘‘టాక్స్ టెర్రరిజం’’గా ఆరోపించింది. ‘‘ ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి మళ్లీ చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది నా హామీ’’ అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ హెచ్చరించారు.
Also Read
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ఐటీ శాఖ రూ. 200 కోట్ల జరిమానా విధించడంతో ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా నోటీసులు మరింత ఇబ్బందికి గురిచేశాయి. హైకోర్టు ఈ కేసులో ఎలాంటి ఉపశమనం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది.
ఐటీ శాఖ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బీజేపీ గత కొన్నేళ్లుగా వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్ను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. బీజేపీ ఆదాయ పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆ పార్టీ నుంచి రూ. 4617.58 కోట్ల డిమాండ్ని సేకరించాలని ఐటీని కోరారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రైడ్ లంచాలు, షెల్ కంపెనీలను ఉపయోగించి ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ద్వారా బీజేపీ రూ. 8200 కోట్లు వసూలు చేసిందని జైరాం రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!