Rahul Gandhi: ప్రభుత్వం మారితే వారిపై చర్యలు, ఇదే నా హామీ.. రాహుల్ గాంధీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ రూ. 1800 కోట్లు ఫైన్ కట్టాలని ఇన్కమ్ టాక్స్ నోటీసులు అందుకున్న తర్వాత దీనిని ‘‘టాక్స్ టెర్రరిజం’’గా ఆరోపించింది. ‘‘ ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి మళ్లీ చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది నా హామీ’’ అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ హెచ్చరించారు.
Also Read
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
ఐటీ శాఖ రూ. 200 కోట్ల జరిమానా విధించడంతో ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా నోటీసులు మరింత ఇబ్బందికి గురిచేశాయి. హైకోర్టు ఈ కేసులో ఎలాంటి ఉపశమనం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది.
ఐటీ శాఖ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. బీజేపీ గత కొన్నేళ్లుగా వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్ను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. బీజేపీ ఆదాయ పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆ పార్టీ నుంచి రూ. 4617.58 కోట్ల డిమాండ్ని సేకరించాలని ఐటీని కోరారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రైడ్ లంచాలు, షెల్ కంపెనీలను ఉపయోగించి ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ ద్వారా బీజేపీ రూ. 8200 కోట్లు వసూలు చేసిందని జైరాం రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
जब सरकार बदलेगी तो ‘लोकतंत्र का चीरहरण’ करने वालों पर कार्रवाई ज़रूर होगी!
और ऐसी कार्रवाई होगी कि दोबारा फिर किसी की हिम्मत नहीं होगी, ये सब करने की।
ये मेरी गारंटी है।#BJPTaxTerrorism pic.twitter.com/SSkiolorvH
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2024
తాజావార్తలు
-
TIMS : టిమ్స్లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!