Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
Waltair Veerayya Veera Simha Reddy Both Got UA Certificate: ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని రీతితో ఈ సారి సంక్రాంతి సందడి సాగనుంది. ఎందుకంటే, ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ నిర్మించి, ఒక్క రోజు తేడాతో విడుదల చేయడం విశేషంగా మారింది. ఇలాంటి పోటీ గతంలో ఎన్నడూ సాగలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ సినిమాలను తీయడమే కాదు, ఆ రెండు చిత్రాలను ఒక్క రోజు తేడాతో విడుదల చేసే అతి సాహసానికి శ్రీకారం చుట్టారు ‘మైత్రీ మూవీస్’ అధినేతలు యెర్నేని నవీన్, వై. రవిశంకర్. ఒకే సంస్థ నుండి వస్తోన్న ఈ రెండు చిత్రాలలో ఒకే హీరోయిన్ శ్రుతి హాసన్ నటించడం మరో విశేషం! కాగా ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో ఇంకో విశేషం చోటు చేసుకుంది. ఈ రెండు చిత్రాలకు సెన్సార్ నుండి కూడా ఒకే రకమైన ‘యు/ఏ’ సర్టిఫికెట్ లభించడమే ఆ విశేషం!
జనవరి 12వ తేదీన ముందుగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతోంది. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ లభించిన ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందిదట! ఇక జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానుంది. ఈ సినిమా కొన్ని రోజుల ముందే సెన్సార్ జరుపుకొని యు/ఏ సర్టిఫికెట్ సంపాదించింది. ఈ సినిమా ప్రదర్శన సమయం 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు చిత్రాల్లోనూ ‘బ్రదర్ సెంటిమెంట్’ ఉందని సమాచారం. బాలకృష్ణ సినిమా ఆయనకు కంచుకోట లాంటి రాయలసీమ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోగా, చిరంజీవికి ఎంతో ఇష్టమైన ‘వాల్తేరు’నే టైటిల్ లో నింపుకొని ఆయన సినిమా వస్తోంది.
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన ఈ రెండు సినిమాల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తమిళ చిత్రం ‘వారిసు’ డబ్బింగ్ వర్షన్ ‘వారసుడు’ను తెలుగునాట మూడు రోజులు వాయిదా వేసుకోవడమూ ప్రస్తుతం సినీజనాల్లో చర్చనీయాంశమయింది. తెలుగు సినిమా బాగుంటేనే తాము బాగుంటామని, అందువల్లే తెలుగు స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలకు మొదటి రోజున థియేటర్లకు ఇబ్బంది కలుగ కూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దిల్ రాజు చెప్పడాన్ని సినీపరిశ్రమలోని అధిక సంఖ్యాకులు అభినందిస్తున్నారు. ఇంతలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోన్న ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాయో మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో