Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Veerayya Veera Simha Reddy Both Got UA Certificate: ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని రీతితో ఈ సారి సంక్రాంతి సందడి సాగనుంది. ఎందుకంటే, ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ నిర్మించి, ఒక్క రోజు తేడాతో విడుదల చేయడం విశేషంగా మారింది. ఇలాంటి పోటీ గతంలో ఎన్నడూ సాగలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ సినిమాలను తీయడమే కాదు, ఆ రెండు చిత్రాలను ఒక్క రోజు తేడాతో విడుదల చేసే అతి సాహసానికి శ్రీకారం చుట్టారు ‘మైత్రీ మూవీస్’ అధినేతలు యెర్నేని నవీన్, వై. రవిశంకర్. ఒకే సంస్థ నుండి వస్తోన్న ఈ రెండు చిత్రాలలో ఒకే హీరోయిన్ శ్రుతి హాసన్ నటించడం మరో విశేషం! కాగా ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో ఇంకో విశేషం చోటు చేసుకుంది. ఈ రెండు చిత్రాలకు సెన్సార్ నుండి కూడా ఒకే రకమైన ‘యు/ఏ’ సర్టిఫికెట్ లభించడమే ఆ విశేషం!
జనవరి 12వ తేదీన ముందుగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతోంది. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ లభించిన ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందిదట! ఇక జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానుంది. ఈ సినిమా కొన్ని రోజుల ముందే సెన్సార్ జరుపుకొని యు/ఏ సర్టిఫికెట్ సంపాదించింది. ఈ సినిమా ప్రదర్శన సమయం 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు చిత్రాల్లోనూ ‘బ్రదర్ సెంటిమెంట్’ ఉందని సమాచారం. బాలకృష్ణ సినిమా ఆయనకు కంచుకోట లాంటి రాయలసీమ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోగా, చిరంజీవికి ఎంతో ఇష్టమైన ‘వాల్తేరు’నే టైటిల్ లో నింపుకొని ఆయన సినిమా వస్తోంది.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన ఈ రెండు సినిమాల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తమిళ చిత్రం ‘వారిసు’ డబ్బింగ్ వర్షన్ ‘వారసుడు’ను తెలుగునాట మూడు రోజులు వాయిదా వేసుకోవడమూ ప్రస్తుతం సినీజనాల్లో చర్చనీయాంశమయింది. తెలుగు సినిమా బాగుంటేనే తాము బాగుంటామని, అందువల్లే తెలుగు స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలకు మొదటి రోజున థియేటర్లకు ఇబ్బంది కలుగ కూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దిల్ రాజు చెప్పడాన్ని సినీపరిశ్రమలోని అధిక సంఖ్యాకులు అభినందిస్తున్నారు. ఇంతలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోన్న ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాయో మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!