Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Veerayya Veera Simha Reddy Both Got UA Certificate: ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని రీతితో ఈ సారి సంక్రాంతి సందడి సాగనుంది. ఎందుకంటే, ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ నిర్మించి, ఒక్క రోజు తేడాతో విడుదల చేయడం విశేషంగా మారింది. ఇలాంటి పోటీ గతంలో ఎన్నడూ సాగలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ సినిమాలను తీయడమే కాదు, ఆ రెండు చిత్రాలను ఒక్క రోజు తేడాతో విడుదల చేసే అతి సాహసానికి శ్రీకారం చుట్టారు ‘మైత్రీ మూవీస్’ అధినేతలు యెర్నేని నవీన్, వై. రవిశంకర్. ఒకే సంస్థ నుండి వస్తోన్న ఈ రెండు చిత్రాలలో ఒకే హీరోయిన్ శ్రుతి హాసన్ నటించడం మరో విశేషం! కాగా ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో ఇంకో విశేషం చోటు చేసుకుంది. ఈ రెండు చిత్రాలకు సెన్సార్ నుండి కూడా ఒకే రకమైన ‘యు/ఏ’ సర్టిఫికెట్ లభించడమే ఆ విశేషం!
జనవరి 12వ తేదీన ముందుగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతోంది. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ లభించిన ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందిదట! ఇక జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానుంది. ఈ సినిమా కొన్ని రోజుల ముందే సెన్సార్ జరుపుకొని యు/ఏ సర్టిఫికెట్ సంపాదించింది. ఈ సినిమా ప్రదర్శన సమయం 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు చిత్రాల్లోనూ ‘బ్రదర్ సెంటిమెంట్’ ఉందని సమాచారం. బాలకృష్ణ సినిమా ఆయనకు కంచుకోట లాంటి రాయలసీమ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోగా, చిరంజీవికి ఎంతో ఇష్టమైన ‘వాల్తేరు’నే టైటిల్ లో నింపుకొని ఆయన సినిమా వస్తోంది.
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, రామ్చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన ఈ రెండు సినిమాల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తమిళ చిత్రం ‘వారిసు’ డబ్బింగ్ వర్షన్ ‘వారసుడు’ను తెలుగునాట మూడు రోజులు వాయిదా వేసుకోవడమూ ప్రస్తుతం సినీజనాల్లో చర్చనీయాంశమయింది. తెలుగు సినిమా బాగుంటేనే తాము బాగుంటామని, అందువల్లే తెలుగు స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలకు మొదటి రోజున థియేటర్లకు ఇబ్బంది కలుగ కూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దిల్ రాజు చెప్పడాన్ని సినీపరిశ్రమలోని అధిక సంఖ్యాకులు అభినందిస్తున్నారు. ఇంతలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోన్న ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాయో మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.
తాజావార్తలు
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!