Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Veerayya Veera Simha Reddy Both Got UA Certificate: ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని రీతితో ఈ సారి సంక్రాంతి సందడి సాగనుంది. ఎందుకంటే, ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ నిర్మించి, ఒక్క రోజు తేడాతో విడుదల చేయడం విశేషంగా మారింది. ఇలాంటి పోటీ గతంలో ఎన్నడూ సాగలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ సినిమాలను తీయడమే కాదు, ఆ రెండు చిత్రాలను ఒక్క రోజు తేడాతో విడుదల చేసే అతి సాహసానికి శ్రీకారం చుట్టారు ‘మైత్రీ మూవీస్’ అధినేతలు యెర్నేని నవీన్, వై. రవిశంకర్. ఒకే సంస్థ నుండి వస్తోన్న ఈ రెండు చిత్రాలలో ఒకే హీరోయిన్ శ్రుతి హాసన్ నటించడం మరో విశేషం! కాగా ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో ఇంకో విశేషం చోటు చేసుకుంది. ఈ రెండు చిత్రాలకు సెన్సార్ నుండి కూడా ఒకే రకమైన ‘యు/ఏ’ సర్టిఫికెట్ లభించడమే ఆ విశేషం!
జనవరి 12వ తేదీన ముందుగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతోంది. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ లభించిన ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందిదట! ఇక జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానుంది. ఈ సినిమా కొన్ని రోజుల ముందే సెన్సార్ జరుపుకొని యు/ఏ సర్టిఫికెట్ సంపాదించింది. ఈ సినిమా ప్రదర్శన సమయం 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు చిత్రాల్లోనూ ‘బ్రదర్ సెంటిమెంట్’ ఉందని సమాచారం. బాలకృష్ణ సినిమా ఆయనకు కంచుకోట లాంటి రాయలసీమ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోగా, చిరంజీవికి ఎంతో ఇష్టమైన ‘వాల్తేరు’నే టైటిల్ లో నింపుకొని ఆయన సినిమా వస్తోంది.
Also Read
- Varanasi: బర్త్డేకు 'వారణాసి' ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
- Narne Nithiin: వరుస హిట్ల తర్వాత మరో క్రేజీ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్
- Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
- Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన ఈ రెండు సినిమాల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తమిళ చిత్రం ‘వారిసు’ డబ్బింగ్ వర్షన్ ‘వారసుడు’ను తెలుగునాట మూడు రోజులు వాయిదా వేసుకోవడమూ ప్రస్తుతం సినీజనాల్లో చర్చనీయాంశమయింది. తెలుగు సినిమా బాగుంటేనే తాము బాగుంటామని, అందువల్లే తెలుగు స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలకు మొదటి రోజున థియేటర్లకు ఇబ్బంది కలుగ కూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దిల్ రాజు చెప్పడాన్ని సినీపరిశ్రమలోని అధిక సంఖ్యాకులు అభినందిస్తున్నారు. ఇంతలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోన్న ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాయో మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.
తాజావార్తలు
-
GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..
-
Snapchat Love Story: స్నాప్చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
-
Varanasi: బర్త్డేకు ‘వారణాసి’ ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
-
India LNG supply: ఎల్ఎన్జీ సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం.. పరిశ్రమలకు భారీ ఊరట
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!