Waheeda Rehman: సీనియర్ నటికి అరుదైన గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waheeda Rehman honoured with Dadasaheb Phalke award: ప్రముఖ నటి వహీదా రెహమాన్కు అరుదైన గౌరవం లభించనుంది. వహీదా రెహమాన్ను ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. వహీదాను దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి ఎంపిక చేసినట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం తెలిపారు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ను షేర్ చేస్తూ ‘వహీదా రెహమాన్ జీ భారతీయ సినిమాకు ఆమె చేసిన విశిష్టమైన కృషికి ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారని తెలియజేయడానికి నేను చాలా సంతోషం ఉన్నాను, గర్వపడుతున్నాను. ‘చరిత్రాత్మకమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన తరుణంలో, వహీదాజీని ఈ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించడం భారతీయ చలనచిత్ర ప్రముఖ మహిళలకు నిజమైన నివాళి. మన చలనచిత్ర చరిత్రలో భాగమైన ఆమె కృషికి నేను ఆమెకు అభినందనలు సవినయంగా తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు.
Bigg Boss 7:నా ప్రాపర్టీ అంటావా… మళ్లీ ప్రశాంత్ పై రెచ్చిపోయిన రతిక
Also Read
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
నిజానికి 54 ఏళ్ల ఈ అవార్డు చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే ఈ అవార్డు లభించింది. మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నటి దేవికా రాణికి 1969లో అందించారు. ఆ తర్వాత, రూబీ మేయర్స్ (సులోచన), కనన్ దేవి, దుర్గా ఖోటే, లతా మంగేష్కర్ సహా ఆశా భోంస్లేలను ఈ అవార్డుతో సత్కరించారు. 2020లో, ఈ అవార్డును ప్రముఖ నటి ఆశా పరేఖ్కు అందించారు.
వహీదా రెహ్మాన్ 1955లో తొలిసారిగా నటించింది. ఇక ఆమె 57 ఏళ్ల కెరీర్లో దాదాపు 90 సినిమాల్లో నటించింది. 1955లో ‘రోజులు మారాయి’ అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్లో ప్యాసా, గైడ్, కాగజ్ కే ఫూల్, చౌదవిన్ కా చంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, ఖామోషి, కభీ కభీ, లమ్హే, రంగ్ దే బసంత్ మరియు ఢిల్లీ 6 వంటి సినిమాలలో నటించింది. ఇక ఇప్పటికే పద్మశ్రీ సహా పద్మభూషణ్ అవార్డులను కూడా ఆమె పొందారు.
1969లో ప్రారంభమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినీ పరిశ్రమలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. దాదాసాహెబ్ ఫాల్కే అని ముద్దుగా పిలుచుకునే ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని పిలవబడే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. దాదాసాహెబ్ 1913లో భారతదేశపు తొలి చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ని అందించారు. ఆయన గౌరవార్ధం అవార్డును 1969లో ప్రారంభించారు. ఈ అవార్డు అందుకున్న వారికి కింద ‘స్వర్ణ కమలం’, రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రం, పట్టు ఫలకం, శాలువాతో సత్కరిస్తారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!