Vishal: ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పను కానీ!!.. హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal Comments at Rathnam Movie Press meet: రత్నం సినిమా ప్రెస్ మీట్ లో హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరి డైరెక్షన్లో విశాల్ రత్నం అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో విశాల్ మాట్లాడుతూ దయచేసి మే 13న కొత్త ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని, తమిళనాడులో నా ఓటు నేను వేశానని అన్నారు. తమిళనాడులో 70 శాతం ఓటింగ్ నమోదైంది, ఇంకో 20 శాతం పోలైతే విప్లవాత్మకమయ్యేదని అన్నారు. తమిళనాడులో ఓటింగ్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని, శుక్రవారం కాకపోతే మరో శుక్రవారం సినిమా చూడొచ్చు కానీ ఓటు మాత్రం ఒక రోజు మాత్రమే వేయగలం అని అన్నారు. ఐదు సంవత్సరాలకోసారి ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చుకోవాలని, నమ్మిన వాళ్లకు ఓటు వేయండి, ఓటు వేయించుకున్న వాళ్లు చేయాల్సిన బాధ్యత చేయాలని అన్నారు.
Ram Charan: గేమ్ చేంజర్ లో మరో రికార్డ్ బ్రేకింగ్ ఫైట్.. కాస్కోండి!
Also Read
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
- RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
- Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
నేను ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేయమని చెప్పను, ఎవరిని కించపరిచేలా మాట్లడటం నాకు ఇష్టం ఉండదు, నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటానని అన్నారు. తమిళనాడులో ఇంకో జెండా, ఇంకో నాయకుడు రాకూడదనుకుంటా, రాజకీయ నాయకులు వాళ్ల పని సరిగ్గా చేస్తే మరో పార్టీ , ఇంకో నాయకుడు పుట్టడని అన్నారు. రాజకీయ నాయకులు నటులుగా మారుతుంటే నటులు రాజకీయ నాయకులవుతున్నారని అన్నారు. నా దృష్టిలో రాజకీయం అనేది సమాజ సేవ, నేను అమ్మ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని అన్నారు. మా స్వచ్చంద సంస్థ ద్వారా తెలియని వ్యక్తులకు సాయం చేయడం మా ఏజెండా, రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయడం ఎజెండాగా ఉండాలని అన్నారు. ప్రజలు బెంజ్ కార్ అడుగుతారా? బంజారాహిల్స్ లో ఇళ్లు అడుగుతున్నారా ? తాగడానికి మంచినీళ్లు, విద్య, వైద్యం, బతకాలని ప్రజలు అడుగుతారని అన్నారు. నేను ఇప్పుడు ఒక ఓటరును మాత్రమే, నేను ఏ రాజకీయ నాయకుడితో కలిసి పనిచేయను, ఏ పార్టీలో కలిసిపోనని అన్నారు.
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!