Vishal: ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పను కానీ!!.. హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishal Comments at Rathnam Movie Press meet: రత్నం సినిమా ప్రెస్ మీట్ లో హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరి డైరెక్షన్లో విశాల్ రత్నం అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో విశాల్ మాట్లాడుతూ దయచేసి మే 13న కొత్త ఓటర్లంతా తప్పకుండా ఓటు వేయాలని, తమిళనాడులో నా ఓటు నేను వేశానని అన్నారు. తమిళనాడులో 70 శాతం ఓటింగ్ నమోదైంది, ఇంకో 20 శాతం పోలైతే విప్లవాత్మకమయ్యేదని అన్నారు. తమిళనాడులో ఓటింగ్ స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని, శుక్రవారం కాకపోతే మరో శుక్రవారం సినిమా చూడొచ్చు కానీ ఓటు మాత్రం ఒక రోజు మాత్రమే వేయగలం అని అన్నారు. ఐదు సంవత్సరాలకోసారి ఓటర్లు తమ బాధ్యత నెరవేర్చుకోవాలని, నమ్మిన వాళ్లకు ఓటు వేయండి, ఓటు వేయించుకున్న వాళ్లు చేయాల్సిన బాధ్యత చేయాలని అన్నారు.
Ram Charan: గేమ్ చేంజర్ లో మరో రికార్డ్ బ్రేకింగ్ ఫైట్.. కాస్కోండి!
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
నేను ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఓటు వేయమని చెప్పను, ఎవరిని కించపరిచేలా మాట్లడటం నాకు ఇష్టం ఉండదు, నేను ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంటానని అన్నారు. తమిళనాడులో ఇంకో జెండా, ఇంకో నాయకుడు రాకూడదనుకుంటా, రాజకీయ నాయకులు వాళ్ల పని సరిగ్గా చేస్తే మరో పార్టీ , ఇంకో నాయకుడు పుట్టడని అన్నారు. రాజకీయ నాయకులు నటులుగా మారుతుంటే నటులు రాజకీయ నాయకులవుతున్నారని అన్నారు. నా దృష్టిలో రాజకీయం అనేది సమాజ సేవ, నేను అమ్మ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని అన్నారు. మా స్వచ్చంద సంస్థ ద్వారా తెలియని వ్యక్తులకు సాయం చేయడం మా ఏజెండా, రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేయడం ఎజెండాగా ఉండాలని అన్నారు. ప్రజలు బెంజ్ కార్ అడుగుతారా? బంజారాహిల్స్ లో ఇళ్లు అడుగుతున్నారా ? తాగడానికి మంచినీళ్లు, విద్య, వైద్యం, బతకాలని ప్రజలు అడుగుతారని అన్నారు. నేను ఇప్పుడు ఒక ఓటరును మాత్రమే, నేను ఏ రాజకీయ నాయకుడితో కలిసి పనిచేయను, ఏ పార్టీలో కలిసిపోనని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?