కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదు. విజయ్ సీఎం అయితే ఈ సినిమా సమస్యలన్నీ చకచకా తీరిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇంకా హోల్డ్లోనే ఉండిపోయింది.
మొదట ఈ చిత్రాన్ని మే నెలాఖరున బక్రీద్ కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. దాంతో చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్తగా జూన్ 19ను రిలీజ్ డేట్గా పరిశీలిస్తోంది. విజయ్ బర్త్డే జూన్ 22 కంటే మూడు రోజుల ముందే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం ద్వారా అభిమానులకు ఒక భారీ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్లాన్ వర్కవుట్ అవ్వాలన్నా సెన్సార్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాలోని కొన్ని కీలక సీన్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2026 ప్రారంభం నుండి ఈ చిత్రం పలుమార్లు రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లినా సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నిరంతర ఆలస్యం వల్ల చిత్ర నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ పై భారీగా ఆర్థిక భారం పడుతోంది. సినిమా థియేట్రికల్ డీల్స్తో పాటు ఓటీటీ బిజినెస్ కూడా ప్రస్తుతం హోల్డ్లో పడిపోయాయి. ప్రతి వారం ఆలస్యం అయ్యే కొద్దీ సినిమా వడ్డీలు, ఖర్చులు పెరిగిపోతుండటంతో మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
