Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ను వేరే లెవల్లో ప్రమోట్ చేస్తున్న వరుణ్.. పుల్వామా టు వాఘా దేన్నీ వదలకుండా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Promoting Operation Valentine aggressively: వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా తెరకెక్కింది. వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మీద ఆయన చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడ్డ దర్శకత్వంలో ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు అలాగే ఏకకాలంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సోలో రిలీజ్ డేట్స్ సర్దుబాట్లలో ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మార్చి ఒకటికి వాయిదా పడింది. ఆ వాయిదా పడిన కాలాన్ని కూడా సినిమా ప్రమోషన్స్ ను మరింత అగ్రెసివ్ గా చేసేందుకు వరుణ్ తేజ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ వందేమాతరం అనే సాంగ్ ని వాఘా – అటారి బోర్డర్లో రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు ఆయన. ఇక ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రియల్ లైఫ్ వింగ్ కమాండర్ తో ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసి దాన్ని మీడియాకి రిలీజ్ చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
Subhaleka Sudhakar: శైలజతో విడాకులు… ఆ తెల్లారి అమ్మ చనిపోయింది
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
ఇక ఆ తర్వాత సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ ఒక హైదరాబాద్ కాలేజీలో లాంచ్ చేసి యూత్ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. నిజానికి ఫిబ్రవరి 14 అనగానే ప్రపంచం అందరికీ వాలెంటైన్స్ డే గుర్తొస్తే భారతీయులకు మాత్రం పుల్వామాలో జరిగిన మారణకాండ గుర్తొస్తుంది. పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన సంగతి ఎవరూ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు పుల్వామా మెమోరియల్ సైట్ ను టీంతో కలిసి సందర్శించారు వరుణ్ తేజ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను, ఫోర్స్ ఆఫీసర్లను సినిమాలో భాగస్వాములుగా చేస్తూ చేసిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా రుహనీ శర్మ మరో కీలక పాత్రలో నటించింది. మామూలుగానే వరుణ్ తేజ్ అంటే ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుని ముందుకు వెళ్తాడు. అయితే తన తొలి బాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో పాటు దేశ భక్తిని చాటుకునే సినిమా కావడంతో వరుణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడాతగ్గేదే లేదన్నట్టు తన 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి దూసుకుపోతున్నాడు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?