Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ను వేరే లెవల్లో ప్రమోట్ చేస్తున్న వరుణ్.. పుల్వామా టు వాఘా దేన్నీ వదలకుండా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Promoting Operation Valentine aggressively: వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా తెరకెక్కింది. వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మీద ఆయన చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడ్డ దర్శకత్వంలో ఈ సినిమాని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు అలాగే ఏకకాలంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. సోలో రిలీజ్ డేట్స్ సర్దుబాట్లలో ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మార్చి ఒకటికి వాయిదా పడింది. ఆ వాయిదా పడిన కాలాన్ని కూడా సినిమా ప్రమోషన్స్ ను మరింత అగ్రెసివ్ గా చేసేందుకు వరుణ్ తేజ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ వందేమాతరం అనే సాంగ్ ని వాఘా – అటారి బోర్డర్లో రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు ఆయన. ఇక ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రియల్ లైఫ్ వింగ్ కమాండర్ తో ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసి దాన్ని మీడియాకి రిలీజ్ చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.
Subhaleka Sudhakar: శైలజతో విడాకులు… ఆ తెల్లారి అమ్మ చనిపోయింది
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
ఇక ఆ తర్వాత సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ ఒక హైదరాబాద్ కాలేజీలో లాంచ్ చేసి యూత్ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. నిజానికి ఫిబ్రవరి 14 అనగానే ప్రపంచం అందరికీ వాలెంటైన్స్ డే గుర్తొస్తే భారతీయులకు మాత్రం పుల్వామాలో జరిగిన మారణకాండ గుర్తొస్తుంది. పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన సంగతి ఎవరూ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు పుల్వామా మెమోరియల్ సైట్ ను టీంతో కలిసి సందర్శించారు వరుణ్ తేజ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను, ఫోర్స్ ఆఫీసర్లను సినిమాలో భాగస్వాములుగా చేస్తూ చేసిన ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా రుహనీ శర్మ మరో కీలక పాత్రలో నటించింది. మామూలుగానే వరుణ్ తేజ్ అంటే ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుని ముందుకు వెళ్తాడు. అయితే తన తొలి బాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో పాటు దేశ భక్తిని చాటుకునే సినిమా కావడంతో వరుణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడాతగ్గేదే లేదన్నట్టు తన 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి దూసుకుపోతున్నాడు.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!