ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ కు వర్మ ‘లడకీ’ చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్ మూవీ ‘లడకీ’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ తో పాటు కుర్రకారుని ఆకట్టుకునే మసాలా సన్నివేశాలకూ వర్మ ఈ ట్రైలర్ లో చోటిచ్చాడు. ఈ ట్రైలర్ విడుదల కాగానే అమితాబ్ బచ్చన్ మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్ సి మీడియా, చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. దాంతో ఈ సినిమాను హిందీలో పాటు చైనీస్ భాషలోనూ విడుదల చేయబోతున్నారు. ఆ దేశంలో ఈ సినిమా ‘డ్రాగన్ గర్ల్’ పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ ది డ్రాగన్’కు తాను ఇస్తున్న నివాళి అని వర్మ చెబుతున్నాడు.
బ్రూస్ లీ 81వ జయంతి సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో ఈ 27వ తేదీ ‘లడకీ’ (ది డ్రాగన్ గర్ల్) మొదటి పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే చైనా లోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేస్తున్నారు. భారతదేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ మూవీగా వర్మ చెబుతున్న ‘లడకీ’లో టైటిల్ రోల్ ను మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు పూజా భలేకర్ పోషించింది. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని చైనా లోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ భారీ ప్రమోషన్ తో 20 వేల థియేటర్స్ లో విడుదల చేయబోతోందని వర్మ తెలిపారు.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం