దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కొండపోలం”. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తుండగా… వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు కొండ పొలం ఆడియోప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో హీరో వైష్ణవ తేజ్ మాట్లాడుతూ… ఈ సినిమా జరుగుతున్న సమయంల నేను చాలా నేర్చుకున్నాను. దర్శకుడు క్రిష్ వద్ద నుండి.. హీరోయిన్ రకుల్ ప్రీత్ దగ్గర నుండి అలాగే ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరి వద్ద నుండి ఏదో ఇక్క విషయాన్ని నేను నేర్చుకున్నాను. అయితే అడవిలో షూటింగ్ చేసే సమయంలో ప్రొడక్షన్ టీం చాలా కష్టపడ్డారు. ఇక బయట ఒక్క పోలీస్, ఐఏఎస్ సాధించడానికి ఎంత కష్ట పడతారో ఈ సినిమాలో హీరో కూడా అంత కష్టపడతాడు. ఒక్కో దశలో ఒక్కో భయాన్ని జేయిస్తాడు హీరో అని తెలిపారు. ఇక అడవిలో ఆ సింహాని జేయించడమే ఈ కొండపోలం అని తెలిపాడు వైష్ణవ్ తేజ్.