Yashoda: సమంత అనారోగ్యం గురించి నాకప్పుడు తెలియదు: ఉన్ని ముకుందన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashoda: సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘యశోద’. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నెల 11వ తేదీ వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ‘యశోద’ సినిమా విడుదల సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు సమంత అనారోగ్యంతో ఉన్నట్టు తెలియదని చెప్పారు.
సమంతతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను తెలియచేస్తూ, ”సమంత చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్ బాగా చేశారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ చేశారు. సెట్లో ఇతర ఆర్టిస్టులతో చక్కగా మాట్లాడతారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బావుంటుందని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నాం. మలయాళంలో వర్కింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నటుడిగా రిహార్సల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. మలయాళ సినిమా సెట్లో ఇతర ఆర్టిస్టులకు సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తా. ముందు ఏం చేస్తానో చెప్పను. డైరెక్ట్ కెమెరా ముందు చేసి చూపిస్తా. అప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేచురల్గా ఉంటాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నాకు సమంత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలియదు. సమంత చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి శాడ్ గా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ మైయోసిటిస్తో పోరాటం చేస్తారు. ఆరోగ్యంతో మన ముందుకు వస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.
Also Read
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
- Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్'కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
ఈ చిత్రంలో తాను పోషించింది డాక్టర్ పాత్ర అని అందరూ ట్రైలర్ చూసి భావిస్తున్నారని, అయితే ఆ పాత్రకు సంబంధించి చాలా లోతైన అంశాలు ఉన్నాయని, వాటిని ఇప్పుడే రివీల్ చేయడం సబబు కాదని ఉన్ని ముకుందన్ తెలిపారు. ‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ’ తర్వాత ఉన్ని ముకుందన్ తెలుగులో చేస్తున్న నాలుగో చిత్రమిది. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గురించి మాట్లాడుతూ, ”ఆయన చాలా హంబుల్ పర్సన్. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. స్టోరీ లైన్, స్క్రిప్ట్లో ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏం కావాలన్నా ఇస్తారు. ఎప్పుడూ సినిమా బాగా రావాలని ఆశిస్తారు. దానికి ఏం చేయడానికి అయినా రెడీగా ఉంటారు. మా టీమ్, డైరెక్టర్స్ అంతా శ్రీదేవి మూవీస్ సంస్థకు కృతజ్ఞతతో ఉండాలి. ‘యశోద’ ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఐడియా. మన సొసైటీ ఎటు వెళుతుందనేది చూపిస్తున్నారు. త్వరలో అది రియాలిటీగా మారుతుంది” అని అన్నారు. ఈ కథ గురించి వివరిస్తూ, ”సరోగసీ అనేది వ్యక్తిగత పరమైన అంశం. చట్టప్రకారం సరోగసీని ఆశ్రయించినప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. సరోగసీ అనేది చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. ఈజీగా దానిపై కామెంట్ చేయకూడదు. సైంటిఫిక్గా చూస్తే… మిరాకిల్. పురాణాల్లో మనం అటువంటి వాటి గురించి విన్నాం” అని అన్నారు. ప్రస్తుతం మలయాళంలో రెండు మూడు చిత్రాలు చేస్తున్నానని, అందులో ‘మాలికాపురం’ అనే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారని, అది తెలుగులోనూ విడుదల అవుతుందని ఉన్ని ముకుందన్ తెలిపారు.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!