Tollywood Crisis: టాలీవుడ్లో ‘షేరింగ్’ సెగ.. మే 1 నుంచి థియేటర్ల బంద్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విధంగా ఒక వివాదం తెర మీదకు వచ్చింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానులు) మధ్య మొదలైన ‘రెవెన్యూ షేరింగ్’ వివాదం టాలీవుడ్ను కుదిపేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరకపోతే వచ్చే నెల మే 1వ తేదీ నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేసి, నిరవధిక సమ్మెకు దిగుతామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన భారీ చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. చాలా కాలంగా థియేటర్ల యజమానులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గురించి చెబుతున్నారు. ముఖ్యంగా నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం తమను నష్టాల్లోకి నెడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతమున్న రెంటల్ పద్ధతి కాకుండా, కలెక్షన్లలో తమకు సరైన వాటా దక్కేలా రెవెన్యూ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:Siva Karthikeyan: అడగకుండానే 50 లక్షల సాయం.. ఊరికే అయిపోతారా స్టార్లు?
Also Read
- 2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
- Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
- Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్కు ముందే లాభాలు
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
అయితే, ఈ ప్రతిపాదనను ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్మాణ వ్యయం ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోందని, ఇలాంటి సమయంలో రెవెన్యూ షేరింగ్ మోడల్ వల్ల నిర్మాతలు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు. ఈ ఇరు వర్గాల మొండివైఖరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1 నుంచి థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. ఒకవేళ థియేటర్ల సమ్మె నిజంగానే జరిగితే, సమ్మర్ సీజన్ను క్యాష్ చేసుకుందామని భావిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చాక పోయినా నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీ స్వయంభూ మే నెల మీదే కన్నేయడంతో దానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న మా ఇంటి బంగారం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను లక్ష్యంగా చేసుకుంది. టైటిల్తో ఆసక్తి రేపుతున్న కొరియన్ కనకరాజు సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సూర్య కరుప్పు కూడా మే నెల రేసులోనే ఉంది. ఈ సినిమాలే కాకుండా మరికొన్ని చిన్న, మధ్య తరహా చిత్రాలు కూడా మే నెలలో విడుదల తేదీలను ప్రకటించుకున్నాయి. మే నెలలో వరుస సెలవులు ఉండటంతో మంచి కలెక్షన్లు వస్తాయని ఆశించిన నిర్మాతలకు ఈ సమ్మె వార్త ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!