Tollywood Crisis: టాలీవుడ్లో ‘షేరింగ్’ సెగ.. మే 1 నుంచి థియేటర్ల బంద్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విధంగా ఒక వివాదం తెర మీదకు వచ్చింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానులు) మధ్య మొదలైన ‘రెవెన్యూ షేరింగ్’ వివాదం టాలీవుడ్ను కుదిపేస్తోంది. తమ డిమాండ్లు నెరవేరకపోతే వచ్చే నెల మే 1వ తేదీ నుంచి సినిమాల ప్రదర్శనను నిలిపివేసి, నిరవధిక సమ్మెకు దిగుతామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన భారీ చిత్రాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. చాలా కాలంగా థియేటర్ల యజమానులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గురించి చెబుతున్నారు. ముఖ్యంగా నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీల ప్రభావంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం తమను నష్టాల్లోకి నెడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతమున్న రెంటల్ పద్ధతి కాకుండా, కలెక్షన్లలో తమకు సరైన వాటా దక్కేలా రెవెన్యూ షేరింగ్’ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:Siva Karthikeyan: అడగకుండానే 50 లక్షల సాయం.. ఊరికే అయిపోతారా స్టార్లు?
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
అయితే, ఈ ప్రతిపాదనను ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్మాణ వ్యయం ఇప్పటికే ఆకాశాన్ని తాకుతోందని, ఇలాంటి సమయంలో రెవెన్యూ షేరింగ్ మోడల్ వల్ల నిర్మాతలు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు. ఈ ఇరు వర్గాల మొండివైఖరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1 నుంచి థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. ఒకవేళ థియేటర్ల సమ్మె నిజంగానే జరిగితే, సమ్మర్ సీజన్ను క్యాష్ చేసుకుందామని భావిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చాక పోయినా నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా మూవీ స్వయంభూ మే నెల మీదే కన్నేయడంతో దానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న మా ఇంటి బంగారం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను లక్ష్యంగా చేసుకుంది. టైటిల్తో ఆసక్తి రేపుతున్న కొరియన్ కనకరాజు సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సూర్య కరుప్పు కూడా మే నెల రేసులోనే ఉంది. ఈ సినిమాలే కాకుండా మరికొన్ని చిన్న, మధ్య తరహా చిత్రాలు కూడా మే నెలలో విడుదల తేదీలను ప్రకటించుకున్నాయి. మే నెలలో వరుస సెలవులు ఉండటంతో మంచి కలెక్షన్లు వస్తాయని ఆశించిన నిర్మాతలకు ఈ సమ్మె వార్త ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!