Tollywood : ఈ వారం పోటీ పడుతున్న చిత్రాలు ఏవంటే!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం రెండు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం ఆరు సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఈ వీకెండ్ రెండు డబ్బింగ్ మూవీస్ తో కలిపి ఎనిమిది సినిమాలు విడుదల కాబోతుండటం విశేషం. శింబు నటించిన ‘వెందు తనిందదు కాడు’ మూవీ తెలుగులో ‘ముత్తు’ పేరుతో గురువారమే జనం ముందుకు వచ్చేస్తోంది. గౌతమ్ వాసుదేవ మీనన్, శింబుది హిట్ కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరిగాయి. ఈ మూవీని తెలుగులో స్రవంతి మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేస్తుండటం విశేషం.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్యదీప్తి నిర్మించిన మొదటి సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం జనం ముందుకు వస్తోంది. కిరణ్ అబ్బవరం, శ్రీధర్ గాదె కాంబినేషన్ లో వచ్చిన ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ విజయం సాధించడంతో ఈ సినిమా విజయంపై కిరణ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక మరో సక్సెస్ ఫుల్ కాంబో కూడా ఈ శుక్రవారమే తమ చిత్రాన్ని జనం ముందుకు తీసుకొస్తోంది. వాళ్ళే సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ. వీరిద్దరికి తొలి కలయికలో ‘సమ్మోహనం’ చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘వి’ సినిమాలోనూ నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇది కూడా ‘సమ్మోహనం’ తరహాలోనే సినిమా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. ఇందులో కృతీశెట్టి నాయికగా నటించింది. ఈ సినిమాలతో పాటే నివేద థామస్, రెజీనా కసాండ్రా టైటిల్ రోల్ ప్లే చేసిన ‘శాకిని డాకిని’ మూవీ శుక్రవారం రాబోతోంది. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’కు ఇది అఫీషియల్ రీమేక్. సుధీర్ వర్మ దీన్ని డైరెక్ట్ చేశారు. తాటి సునీతతో కలిసి సురేశ్ బాబు ఈ మూవీని నిర్మించారు.
ఇక ‘బిగ్ బాస్’ విజేత సన్నీ హీరోగా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘సకల గుణాభిరామ’ చిత్రం, శ్యామ్ మండల రూపొందించిన ‘అం అః’, సగరెడ్డి తుమ్మ తెరకెక్కించిన ‘నేను కేరాఫ్ నువ్వు’ చిత్రాలు 16వ తేదీ విడుదల అవుతున్నాయి. అలానే ఎంతోకాలంగా వాయిదా పడుతూ వచ్చిన కిచ్చా సుదీప్ కన్నడ అనువాద చిత్రం ‘కె -3 – కోటికొక్కడు’ కూడా శుక్రవారం రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాలలో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!