Tollywood Rewind 2023: తారకరత్న, చంద్రమోహన్ సహా 2023లో కన్నుమూసిన తెలుగు సినీ ప్రముఖులు వీరే
Tollywood Rewind 2023: Tollywood Celebrities Who Died in 2023: 2023లో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చాలా నష్టం జరిగింది. తారకరత్న చంద్రమోహన్, కె.విశ్వనాథ్, శరత్ బాబు సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కనుమూశారు. 2023 చివరికి వచ్చేసిన క్రమంలో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన వారి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను.
చంద్రమోహన్: ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన చంద్రమోహన్ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో హృదయ రోగంతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు
Also Read
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
శరత్ బాబు : ఈ ఏడాది మే 22న తెలుగు సహా దక్షిణాది భాషల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్న శరత్ బాబు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసారు. శరత్ బాబు మృతిపై తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
‘రే స్టీవేన్సన్’: ఈ ఏడాది మే 22న RRR సినిమాలో బ్రిటీష్ పాలకుడి పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ అనారోగ్యంతో కన్నుమూశారు, చనిపోయే నాటికీ ఆయన వయసు 58 ఏళ్లు.
సంగీత దర్శకుడు రాజ్ : ఈ ఏడాది మే 21న ‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు.
మనో బాల: ఈ ఏడాది మే 3న తమిళంలో పాటు తెలుగులో తన కామెడీతో ఆకట్టుకున్న మనోబాల మే 3న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.
సతీష్ కౌశిక్: ఈ ఏడాది మార్చి 9న ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
మయిల్సామి: ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రముఖ తమిళ హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన దాదాపు 300 పైగా చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించారు.
తారకరత్న ఈ ఏడాది ఫిబ్రవరి 18న నందమూరి మూడో తరం నట వారసుడు తారకతర్న నారా లోకేష్ యువగళం పాత్ర ప్రారంభమైన క్రమంలో పాల్గొని కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శివైక్యం చెందాడు.
కే.విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 92 ఏళ్లు.
దర్శకుడు సాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2మా అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూశారు. రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, వంటి సినిమాలను తీశారు.
జమున ఈ ఏడాది జనవరి 27న జమున వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు తెర సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఆమె.
బాల మురుగన్ ఈ ఏడాది జనవరి 16న అనారోగ్యంతో కన్నుమూశారు. ముఖ తెలుగు, తమిళ రచయిత భూపతిరాజా తండ్రి, పాపులర్ రైటర్ బాలమురుగన్ తెలుగు, తమిళంలో పలు చిత్రాలకు రచయితగా పనిచేశారు.
తాజావార్తలు
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!