Gopichand : ఆ సినిమాలో గోపీచంద్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ‘జయం’.తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ ‘రాను రాను అంటూనే చిన్నడోయ్’ అని మాచెర్ల నియోజకవర్గం లో పెట్టినందుకు ఆ చిత్రం పై బజ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. ఈ చిత్రం లోని పాటలకు అంత క్రేజ్ అయితే ఉంటుంది.ఈ సినిమా విడుదల అయినా మొదటి వారం మొత్తం నెగటివ్ టాక్ వచ్చింది .కానీ చిన్నగా టాక్ ఇంప్రూవ్ అవుతూ రెండవ వారం నుండి సునామి లాంటి వసూళ్లు వచ్చాయని చెప్తుంటారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.అప్పటి వరకు ఆ ప్రాంతం లో ఆల్ టైం రికార్డు గా కొనసాగిన పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రికార్డు ని కూడా బద్దలు కొట్టిన సినిమా ఇది.
ఈ చిత్రం వసూళ్లను నైజాం ప్రాంతం లో అందుకోవడానికి కొంత మంది స్టార్ హీరోలకు సుమారు పదేళ్లు పట్టిందని తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరో నితిన్ కంటే కూడా ఎక్కువగా విలన్ గా నటించిన గోపీచంద్ కి ఎక్కువ పేరు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ఆయన చూపించిన నట విశ్వరూపం అలా ఉంటుంది.. ఒక విలన్ కి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఏర్పడడం అనేది కేవలం గోపీచంద్ విషయం లోనే జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలను ముందుగా నితిన్ మరియు గోపీచంద్ ని అనుకోలేదట డైరెక్టర్ తేజ. ఆయన దృష్టిలో ఈ పాత్రలకు గాను ఇద్దరు హీరోలను మైండ్ లో ఉంచుకున్నాని సమాచారం.. ఆ హీరోలు మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అల్లరి నరేష్. అల్లు అర్జున్ ని హీరో గా పరిచయం చేస్తూ, అలాగే అల్లరి నరేష్ ని కూడా ఈ సినిమా ద్వారానే విలన్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన అనుకున్నాడని సమాచారం.. కానీ వాళ్ళిద్దరికీ ఈ సినిమా కథ అస్సలు నచ్చలేదు. దీనితో అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి తన కొడుకు నితిన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసే ప్రయత్నంలో ఎన్నో కథలను అయితే విన్నాడు. అందులో ఆయనకీ జయం కథ చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసాడు. ఇక ఈ చిత్రం లో కీలకమైన విలన్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని అనుకున్నారని సమాచారం.. ఆ సమయం లో ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో, ఎప్పటి నుండో తేజ తో టచ్ లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి ఆ అవకాశం దక్కింది.
Also Read
- Tags
- Gopichand
- jayam
- Nithin
- Prakash Raj
- Sada
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!