Gopichand : ఆ సినిమాలో గోపీచంద్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో
ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ‘జయం’.తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ ‘రాను రాను అంటూనే చిన్నడోయ్’ అని మాచెర్ల నియోజకవర్గం లో పెట్టినందుకు ఆ చిత్రం పై బజ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. ఈ చిత్రం లోని పాటలకు అంత క్రేజ్ అయితే ఉంటుంది.ఈ సినిమా విడుదల అయినా మొదటి వారం మొత్తం నెగటివ్ టాక్ వచ్చింది .కానీ చిన్నగా టాక్ ఇంప్రూవ్ అవుతూ రెండవ వారం నుండి సునామి లాంటి వసూళ్లు వచ్చాయని చెప్తుంటారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.అప్పటి వరకు ఆ ప్రాంతం లో ఆల్ టైం రికార్డు గా కొనసాగిన పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రికార్డు ని కూడా బద్దలు కొట్టిన సినిమా ఇది.
ఈ చిత్రం వసూళ్లను నైజాం ప్రాంతం లో అందుకోవడానికి కొంత మంది స్టార్ హీరోలకు సుమారు పదేళ్లు పట్టిందని తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరో నితిన్ కంటే కూడా ఎక్కువగా విలన్ గా నటించిన గోపీచంద్ కి ఎక్కువ పేరు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ఆయన చూపించిన నట విశ్వరూపం అలా ఉంటుంది.. ఒక విలన్ కి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఏర్పడడం అనేది కేవలం గోపీచంద్ విషయం లోనే జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలను ముందుగా నితిన్ మరియు గోపీచంద్ ని అనుకోలేదట డైరెక్టర్ తేజ. ఆయన దృష్టిలో ఈ పాత్రలకు గాను ఇద్దరు హీరోలను మైండ్ లో ఉంచుకున్నాని సమాచారం.. ఆ హీరోలు మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అల్లరి నరేష్. అల్లు అర్జున్ ని హీరో గా పరిచయం చేస్తూ, అలాగే అల్లరి నరేష్ ని కూడా ఈ సినిమా ద్వారానే విలన్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన అనుకున్నాడని సమాచారం.. కానీ వాళ్ళిద్దరికీ ఈ సినిమా కథ అస్సలు నచ్చలేదు. దీనితో అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి తన కొడుకు నితిన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసే ప్రయత్నంలో ఎన్నో కథలను అయితే విన్నాడు. అందులో ఆయనకీ జయం కథ చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసాడు. ఇక ఈ చిత్రం లో కీలకమైన విలన్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని అనుకున్నారని సమాచారం.. ఆ సమయం లో ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో, ఎప్పటి నుండో తేజ తో టచ్ లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి ఆ అవకాశం దక్కింది.
Also Read
- Tags
- Gopichand
- jayam
- Nithin
- Prakash Raj
- Sada
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్ఆర్హెచ్ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
-
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
-
Saying ‘No’ Effectively: ‘కాదు’ అని చెప్పడం నేర్చుకోండి.. ఈ 5 చిట్కాలతో పీపుల్- ప్లీజింగ్ అలవాటు వదిలించుకోండి
-
Rohit Sharma Reaction: జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో భారీ సిక్సర్లు.. తట్టుకోలేని రోహిత్ శర్మ.. ఏం చేసాడంటే.?
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?