Gopichand : ఆ సినిమాలో గోపీచంద్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ‘జయం’.తేజ దర్శకత్వం లో నితిన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఆ చిత్రం లోని పాటలు ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఈ సినిమాలోని పాట లోని చిన్న బిట్ ‘రాను రాను అంటూనే చిన్నడోయ్’ అని మాచెర్ల నియోజకవర్గం లో పెట్టినందుకు ఆ చిత్రం పై బజ్ ఒక్కసారిగా అయితే పెరిగిపోయింది. ఈ చిత్రం లోని పాటలకు అంత క్రేజ్ అయితే ఉంటుంది.ఈ సినిమా విడుదల అయినా మొదటి వారం మొత్తం నెగటివ్ టాక్ వచ్చింది .కానీ చిన్నగా టాక్ ఇంప్రూవ్ అవుతూ రెండవ వారం నుండి సునామి లాంటి వసూళ్లు వచ్చాయని చెప్తుంటారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది.అప్పటి వరకు ఆ ప్రాంతం లో ఆల్ టైం రికార్డు గా కొనసాగిన పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రికార్డు ని కూడా బద్దలు కొట్టిన సినిమా ఇది.
ఈ చిత్రం వసూళ్లను నైజాం ప్రాంతం లో అందుకోవడానికి కొంత మంది స్టార్ హీరోలకు సుమారు పదేళ్లు పట్టిందని తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరో నితిన్ కంటే కూడా ఎక్కువగా విలన్ గా నటించిన గోపీచంద్ కి ఎక్కువ పేరు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ఆయన చూపించిన నట విశ్వరూపం అలా ఉంటుంది.. ఒక విలన్ కి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఏర్పడడం అనేది కేవలం గోపీచంద్ విషయం లోనే జరిగింది. అయితే ఈ సినిమాలో హీరో మరియు విలన్ పాత్రలను ముందుగా నితిన్ మరియు గోపీచంద్ ని అనుకోలేదట డైరెక్టర్ తేజ. ఆయన దృష్టిలో ఈ పాత్రలకు గాను ఇద్దరు హీరోలను మైండ్ లో ఉంచుకున్నాని సమాచారం.. ఆ హీరోలు మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు అల్లరి నరేష్. అల్లు అర్జున్ ని హీరో గా పరిచయం చేస్తూ, అలాగే అల్లరి నరేష్ ని కూడా ఈ సినిమా ద్వారానే విలన్ గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన అనుకున్నాడని సమాచారం.. కానీ వాళ్ళిద్దరికీ ఈ సినిమా కథ అస్సలు నచ్చలేదు. దీనితో అగ్ర నిర్మాతగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి తన కొడుకు నితిన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసే ప్రయత్నంలో ఎన్నో కథలను అయితే విన్నాడు. అందులో ఆయనకీ జయం కథ చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసాడు. ఇక ఈ చిత్రం లో కీలకమైన విలన్ పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని అనుకున్నారని సమాచారం.. ఆ సమయం లో ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడం తో, ఎప్పటి నుండో తేజ తో టచ్ లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ కి ఆ అవకాశం దక్కింది.
Also Read
- Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Oscars Academy :'RRR' ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
- Tags
- Gopichand
- jayam
- Nithin
- Prakash Raj
- Sada
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?