37000 అడుగుల ఎత్తులో ‘వకీల్ సాబ్’… తమన్ ఫ్యాన్ మూమెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన ఫ్యాన్ మూమెంట్ ను చాటుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ “సర్కారు వారి పాట” మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ బార్సిలోనాలో జరుగుతోంది. థమన్ కూడా బార్సిలోనాలో ‘సర్కారు వారి పాట’ టీమ్తో కలసి సందడి చేస్తున్నాడు. తమన్ నిన్న రాత్రి ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
Read Also : మోడీకి కృతజ్ఞతలు… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై రజినీకాంత్ స్పందన
Also Read
తమన్ తన తాజా విమాన ప్రయాణంలో గాలిలో, 37,000 అడుగుల ఎత్తులో ‘వకీల్ సాబ్’ను చూస్తున్న ఒక చిన్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మానిటర్లో ప్లే అవుతున్న ‘పద పద’ పాటను తమన్ కూడా పాడారు. ‘వకీల్ సాబ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ నవంబర్ 16 న విడుదల అవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’, ‘అఖండ’ వంటి చిత్రాలకు స్వరాలు సమకూరుస్తున్న తమన్… పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ కోసం కూడా సంగీతం సమకూరుస్తున్నారు.
#VakeelSaab ON AIR @emirates my journey at 37000 feet is blessed ❤️ #VakeelSaabBGM on #Nov16th ♥️🎧🎵✈️ pic.twitter.com/yfuEUBuB6O
— thaman S (@MusicThaman) October 23, 2021
తాజావార్తలు
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!