JR NTR Fans : అనంతపురంలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నాయకుడు గుత్త ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణ లీక్ అయింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని ధనుని ప్రశ్నించిన ఎమ్మెల్యే. నేను అనంతపురం ఎమ్మెల్యే వార్ 2 సినిమా ఆడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాయి.
Also Read
- Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
- Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
- Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
- Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ఈ వ్యవహారంపై అనంతపురం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ ఎమ్మెల్యే ప్రసాద్ బ్యానర్లు, ఫ్లెక్సీలను చించేసారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. బాద్యయుతమైన పదవిలో ఉండి నీచమైన వ్యాఖ్యలు చేసేందుకు సిగ్గుండాలి. ఎమ్మెల్యే చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకొని, మా హీరోకు బహిరంగంగా క్షమాపనలు చెప్పాలి అని ధర్నా చేస్తున్నారు.
ఎమ్మెల్యే క్షమాపణలు : జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వీడియో మాట్లాడుతూ ‘ ఆ ఆడియో కాల్స్ నావి కాదు. రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ అభిమానులు మనసును నచ్చుకొని ఉంటే.. నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను. నా ప్రమేయం లేకున్నప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి ఈ క్షమాపణలు చెబుతున్నాను. నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడునే’ అని అన్నారు.
తాజావార్తలు
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు