Manchu Family : మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్ కారుపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ వెనుదిరిగారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా సంస్థల్లోకి మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మనోజ్, ఆయన సతీమణి మౌనిక హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. తర్వాత రంగంపేట వచ్చి జల్లికట్టు వీక్షించారు.
అనంతరం మోహన్ బాబు స్కూల్ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. పలు వాహనాల్లో 50-60 మంది అనుచరులు వారిని అనుసరించారు. అంతకుముందే అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు, క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద మోహరించి, మనోజ్ ను అడ్డుకున్నారు. తనకు కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులూ అందలే దని చెప్పడంతో పోలీసులు జిరాక్స్ ప్రతిని అందజేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించా లని వారు నచ్చజెప్పడంతో అంగీకరించిన మనోజ్ గేటు వద్ద బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ‘ఎంతమంది బౌన్సర్లను పంపుతారో పంపండి నేను ఒక్క డిని చాలు వారికి సమాధానం చెప్పడానికి’ అంటూ సవాల్ విసిరారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయల్దేరి పక్కనే ఉన్న కాలేజీ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వెళుతుండగా విష్ణు అనుచ రులుగా భావిస్తున్న యువకుల బృందంలో ఒకరు కర్రతో మనోజ్ వాహనంపై బాదారు. కాగా, కోర్టు ధిక్కరణకు పాల్పడిన మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్లు ఎంబీయూ మీడియా ఇన్చార్జ్ రవి చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు
Also Read
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!