తెలుగు ఒటీటీ ‘ఆహా’లో సూపర్ సక్సస్ అయిన షోల్లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. తమన్, నిత్య మీనన్, సింగర్ కార్తీక్ లు జడ్జ్ ప్యానెల్ లో ఉంది ఈ షో సీజన్ 1ని సూపర్ సక్సస్ చేశారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి రంగం సిద్ధం చేశారు. మార్చ్ 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకి ప్రీమియర్ కానున్న ఈ షోలో నిత్యమీనన్ ప్లేస్ లో గీత మాధురి జడ్జ్ గా వచ్చింది. సింగర్ హేమచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటివలే షో రన్నర్స్ ఆడిషన్స్ ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ వీక్ లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లాంచ్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ లాంచ్ ప్రోమో చూస్తేనే సీజన్ ఫైనలే లాగా ఉంది అంటూ గీత మధురి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసింది. మంచి సింగర్స్, మంచి సాంగ్స్, తమన్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్… గ్యారెంటీడ్ ఫన్ ఇవ్వనున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం తెలుగు రాష్ట్రాల్లోని సంగీత ప్రియులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి వారి వైటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సీజన్ 2 ఫిస్ట్ ఎపిసోడ్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో చూడాలి.
Read Also: RR: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా… వీళ్ల కథతో సినిమానా?