OTT Release: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త రూల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Film Chamber of Commerce new rule! థియేటర్లలో విడుదలయ్యే తెలుగు సినిమాలను ఓటీటీలో ఎన్ని వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనే విషయంలో గత కొంతకాలంగా నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటి వరకూ సినిమా విడుదలైన తర్వాత నాలుగో వారంలో ఓటీటీలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలైతే నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటే బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైన సినిమాలు కొన్ని నాలుగు వారాల కంటే ముందే ఓటీటీలో వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇటీవల కొందరు నిర్మాతలు సినిమాలు థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాత అంటే సుమారుగా ఏడు వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధన పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్యే మార్గంగా దీనికో పరిష్కారం తీసుకు రాబోతోంది. ఆరు కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రదర్శించుకోవచ్చని, అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలను మాత్రం పది వారాల తర్వాతే ఓటీటీలో ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని సూచన చేయబోతోంది. ఇదిలా ఉంటే… మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమాలను ప్రదర్శించాలని కోరుతున్నాయి.
ఇక తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో ఉన్న అనిశ్చిత స్థితిని పొగొట్టే ప్రయత్నం చేసింది. చిన్న సినిమాలను ఎ, బి సెంటర్స్ లో రూ. 100, 125 రూపాయలకు, సి సెంటర్స్ లో రూ. 70, 125 రూపాయలకు ప్రదర్శించాలని పేర్కొంది. అలానే మీడియా బడ్జెట్ మూవీస్ ను ఎ, బి సెంటర్స్ లో రూ. 112, 177కు, సి సెంటర్స్ లో రూ. 100, 177కు ప్రదర్శించాలని తేల్చింది. ఇక బిగ్ బడ్జెట్ మూవీస్ ను అయితే ఎ, బి సెంటర్స్ లో రూ. 177, 295, సి సెంటర్స్ లో రూ. 150, 295కు ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపింది. వీరి దృష్టిలో ‘ట్రిపుల్ ఆర్’ వంటి సినిమాలు భారీ బడ్జెట్ కేటగిరిలోకి వస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా వచ్చే మీడియం బడ్జెట్ మూవీస్ ను అత్యధికంగా రూ. 177కు జనం చూడొచ్చు. ఇదిలా ఉంటే… మల్టీప్లెక్స్ థియేటర్ల రేట్స్ విషయంలో మాత్రం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకోలేదు. ఈ రేట్లపై ప్రేక్షకులు, సినీజనం ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Tollywood : పర్సంటేజ్' స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!