Tammareddy Bharadwaja: దేశాన్ని తగలెడతా అంటే మనల్ని తగలెడతారు.. విజయ్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammareddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతగా ఆయన ఎన్నో మంచి హిట్స్ ను టాలీవుడ్ కు అందించారు. ఇక ఇండస్ట్రీలోని కొన్ని సమస్యలపై ఆయన ఎప్పుడు తన గొంతును వినిపిస్తారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. తాజాగా తమ్మారెడ్డి, లైగర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకొంది.
ఇక ఈ సినిమాపై తమ్మారెడ్డి మాట్లాడుతూ ” ఊరికే ఎగిరెగిరి పడకూడదు.. దేశాన్ని తగలెడతాం.. ఊరిని తగలెడతాం అంటే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు. సినిమా తీశామంటే.. బాబు మేము సినిమా చేశాం చూడండి అని ప్రేక్షకులను అడగాలి. ఇలా చిటికెలు వేస్తూ చెప్తే.. వారుకూడా చిటికెలు వేస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పూరి గురించి మాట్లాడుతూ “నాకు మొదటి నుంచి పూరి సినిమాలు అంటే చాలా ఇష్టం.. కానీ లైగర్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నేను సినిమా చూడలేదు.. చూడాలని కూడా అనిపించలేదు. ట్రైలర్ చూశాకా ఈ సినిమా అస్సలు సినిమా చూడాలనిపించలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా ఆయన చెప్పినదాంట్లో కూడా నిజం లేకపోలేదు అని కొందరు అంటుండగా.. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి.. మంచి హిట్ ఇస్తే మళ్లీ నార్మల్ అయిపోతుంది అని మరికొందరు అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!