Janhvi Kapoor: ‘భారత్ మాతాకీ జై’ వివాదం పై.. కౌంటర్ ఇచ్చిన జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడ కనిపించినా ట్రెండ్ అవుతుందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ముంబయిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జాన్వీ ఉత్సాహంగా అందరితో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. అయితే ఒక సందర్భంలో ఆమె ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించగా, సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. “స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి వేరు.. ఈ సందర్భంలో ఆ నినాదం అవసరమా?” అంటూ విమర్శలు చేశారు. దీంతో ఈ ట్రోల్స్కి జాన్వీ సూటిగా స్పందించింది. తన ఇన్స్టా స్టోరీలో..
Also Read : SSMB29 : మహేష్ – రాజమౌళి మూవీ షూటింగ్ అప్డేట్.. !
Also Read
- Jagapathi Babu : 'పెద్ది'ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
- Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
‘‘అక్కడ పాల్గొన్నవారంతా ముందే ‘భారత్ మాతాకీ జై’ అన్నారు. తర్వాత నేను కూడా అన్నాను. కానీ వీడియోను కట్ చేసి నా మాటలనే వైరల్ చేస్తున్నారు. అయినా దేశాన్ని పొగడటానికి ఒక ప్రత్యేక రోజుకే పరిమితం కాదు. ప్రతిరోజూ నేను గర్వంగా ‘భారత్ మాతాకీ జై’ అంటాను’’ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఈ వేడుకలో జాన్వీ మరాఠీలో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తన రాబోయే చిత్రం ‘పరమ్ సుందరి’ (ఆగస్టు 29న విడుదల)ని తప్పక చూడమని అభిమానులను కోరింది. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
కాగా ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో నటించారు. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కేరళ అమ్మాయిగా, సిద్ధార్థ్ దిల్లీ అబ్బాయిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలు పాజిటివ్ టాక్ను తెచ్చుకున్నాయి. ప్రత్యేకంగా “ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నా.. నిజమైన ప్రేమ ఒకరితోనే ఉంటుంది” అనే డైలాగ్ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!