Smriti Irani: ఒక్కో ఎపిసోడ్కి రూ.14 లక్షల రెమ్యునరేషన్.. స్పందించిన స్మృతి ఇరానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటి స్మృతి ఇరానీ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న హిట్ ధారావాహిక ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ తో బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్కు రూ.14 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు ఇటీవల తెగ చెలరేగాయి. అయితే ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరగడం తో, స్మృతి ఇరానీ ఈ రెమ్యునరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
Also Read: Bullettu Bandi : ‘బుల్లెట్టు బండి’ టీజర్ రిలీజ్..అదరగొట్టిన లారెన్స్ అన్నాదమ్ములు
Also Read
- Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
- Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!
- Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్కు బుర్రపాడు... మెంటలెక్కించే ట్విస్టులు మావా
- Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్... ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
స్మృతి మాట్లాడుతూ.. “నేనే బుల్లితెరలో అందరికంటే ఎక్కువ పారితోషికం పొందుతున్న నటిని. గతంలో ఈ సీరియల్ ప్రేక్షకాదరణతో పాటు రేటింగ్ పరంగానూ టాప్ స్థాయిలో ఉండేది. అలాంటప్పుడు నటీనటులకు కావలసిన మేర పారితోషికం అందించడం సహజం. మేము కాంట్రాక్టర్లతో మాట్లాడుకోని ఒప్పందాలు చేసుకుంటాం. నేను యూనియన్ సభ్యురాలిని కాబట్టి, నాకు కూడా ఒక నంబర్ ఉంటుంది. దాని ఆధారంగా పారితోషికం తీసుకుంటాను. నేను ఇతర నటీనటులను ఓడించానని చెప్పవచ్చు. అందుకే నన్ను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతారు. ఇది కేవలం నటన మాత్రమే కాదు, ఓ బాధ్యత కూడా’ అని తెలిపింది. కానీ ఎంత తీసుకుంటుందో నెంబర్ మాత్రం చెప్పలేదు.
దాదాపు 25 సంవత్సరాల క్రితం ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ ధారావాహికలో తులసి పాత్ర ద్వారా స్మృతి ఇరానీ పాపులారిటీని అందుకున్నారు. 2000 జూలైలో ప్రారంభమైన ఈ సీరియల్ 2008 నవంబరు వరకూ విజయవంతంగా ప్రసారం అయింది. ఆ సమయంలో స్మృతి ఇరానీ తులసి పాత్రకు పలు అవార్డులు, విశేషాలాభాలు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు అదే సీరియల్కు రెండో భాగంగా ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ జియో సినిమా, స్టార్ప్లస్ ఛానెల్లలో ప్రసారం అవుతోంది. ఇక ఈ భారీ పారితోషికంతో స్మృతి ఇరానీ బుల్లితెరపై తన కీ రీ ఎంట్రీని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ సీరియల్కు ఎంతో ఎగ్జైటెడ్గా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
-
Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్లతో దీదీ విలవిల..
-
Pakistan-China: జిన్పింగ్తో షెహబాజ్ షరీఫ్ భేటీ.. కాశ్మీర్పై కవ్వింపులు.. మండిపడ్డ భారత్
-
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
-
Satish Sanpal: 8వ తరగతి డ్రాపౌట్ నుంచి వేల కోట్ల అధిపతిగా.. భార్యకు 40 కిలోల బంగారం గిఫ్ట్తో వైరల్గా మారిన సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!