Acharya : కాజల్ ఫ్యాన్స్ కు షాక్… అసలు విషయం చెప్పేసిన స్టార్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఎవరూ ఆమె పేరును కూడా ఎత్తకపోవడం ఆ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. చెర్రీని ఈ విషయం అడిగితే తాను ఫైనల్ కట్ చూడలేదంటూ సమాధానాన్ని దాటవేశారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శివ కొరటాల ఈ సినిమాలో కాజల్ లేదంటూ బాంబ్ పేల్చారు.
Read Also : Pratik Gandhi : ముంబై పోలీసుల వల్ల అవమానం… నటుడి ఆవేదన
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
కొరటాల మాట్లాడుతూ సరైన ప్రాధాన్యత లేని పాత్రకు హీరోయిన్ ను వాడుకోవడం కరెక్ట్ కాదని తాను భావిస్తున్నట్లు వెల్లడించాడు. కథ ప్రకారం చిరు పాత్రకు ప్రేమపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఆమె పాత్రను చొప్పించడానికి ట్రై చేశానని, కానీ తరువాత అది కరెక్ట్ కాదని అన్పించిందని తెలిపారు. “మొదటి షెడ్యూల్ పూర్తవ్వగానే అవుట్ ఫుట్ చూశాను, సంతృప్తికరంగా అనిపించలేదు. ఇదే విషయాన్ని మెగాస్టార్గారితో చర్చించగా, నిర్ణయం నాకే వదిలేశారు. విషయాన్ని కాజల్కి వివరించగా ఆమె నవ్వుతూ స్పందించింది. కాజల్ పాత్రను ‘ఆచార్య’ నుండి పూర్తిగా తొలగించాము. రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవి గారికి లీడింగ్ లేడీ లేదు” అని కొరటాల శివ అన్నారు. కాగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా చిత్రంలో పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, సోనూసూద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!