Acharya : కాజల్ ఫ్యాన్స్ కు షాక్… అసలు విషయం చెప్పేసిన స్టార్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఎవరూ ఆమె పేరును కూడా ఎత్తకపోవడం ఆ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. చెర్రీని ఈ విషయం అడిగితే తాను ఫైనల్ కట్ చూడలేదంటూ సమాధానాన్ని దాటవేశారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శివ కొరటాల ఈ సినిమాలో కాజల్ లేదంటూ బాంబ్ పేల్చారు.
Read Also : Pratik Gandhi : ముంబై పోలీసుల వల్ల అవమానం… నటుడి ఆవేదన
Also Read
- Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. 'ఆర్య' కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
- Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
- JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
- NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
కొరటాల మాట్లాడుతూ సరైన ప్రాధాన్యత లేని పాత్రకు హీరోయిన్ ను వాడుకోవడం కరెక్ట్ కాదని తాను భావిస్తున్నట్లు వెల్లడించాడు. కథ ప్రకారం చిరు పాత్రకు ప్రేమపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఆమె పాత్రను చొప్పించడానికి ట్రై చేశానని, కానీ తరువాత అది కరెక్ట్ కాదని అన్పించిందని తెలిపారు. “మొదటి షెడ్యూల్ పూర్తవ్వగానే అవుట్ ఫుట్ చూశాను, సంతృప్తికరంగా అనిపించలేదు. ఇదే విషయాన్ని మెగాస్టార్గారితో చర్చించగా, నిర్ణయం నాకే వదిలేశారు. విషయాన్ని కాజల్కి వివరించగా ఆమె నవ్వుతూ స్పందించింది. కాజల్ పాత్రను ‘ఆచార్య’ నుండి పూర్తిగా తొలగించాము. రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవి గారికి లీడింగ్ లేడీ లేదు” అని కొరటాల శివ అన్నారు. కాగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా చిత్రంలో పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, సోనూసూద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!