‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. ప్రస్తుతం అతను ఎం.ఎన్. మధు నిర్మిస్తున్న ‘గంధర్వ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గాయత్రి ఆర్. సురేశ్, శీతల్ భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అఫ్సర్ డైరెక్టర్. సాయికుమార్, సురేశ్, బాబుమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ తెలుగు సినిమా ప్రేక్షకులు చూడని ఓ కొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు చెబుతున్నాడు. అలానే సందీప్ మాధవ్ సైతం ఓ వైవిధ్యమైన పాత్రను ఇందులో చేయబోతున్నాడట.
Read Also : జాతీయ పురస్కారాలు అందుకున్న మామఅల్లుడు!
ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సీన్స్ ఉంటాయని, క్లయిమాక్స్ తో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మూవీకి హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల షూటింగ్ జరిగిన ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్, సాయి కుమార్ , సురేష్ లతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ఫైట్ సీన్ లో పాల్గొన్న ఫైటర్స్ కు హీరో సందీప్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ వారికి వెండి నాణాలను బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.