హైదరాబాద్లోని ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య కారణాల వల్ల ఈ కేసులోని ముగ్గురు నిందితులు నేడు కోర్టుకు హాజరుకాలేకపోయారని వారి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. హీరో అల్లు అర్జున్కు ఇప్పటికే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే. ఛార్జ్షీట్తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు (Devices), ఎలక్ట్రానిక్ ఆధారాలు (Electronic Evidence), సీసీటీవీ ఫుటేజీలు తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కోర్టు, ఛార్జ్షీట్లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, ఫుటేజీలు మరియు పత్రాలను తదుపరి విచారణ సమయానికల్లా నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు

Sandhya Theatre Stampede
