Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు

Sandhya Theatre Stampede

Sandhya Theatre Stampede

హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.  అనారోగ్య కారణాల వల్ల ఈ కేసులోని ముగ్గురు నిందితులు నేడు కోర్టుకు హాజరుకాలేకపోయారని వారి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే.  ఛార్జ్‌షీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు (Devices), ఎలక్ట్రానిక్ ఆధారాలు (Electronic Evidence), సీసీటీవీ ఫుటేజీలు తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కోర్టు, ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, ఫుటేజీలు మరియు పత్రాలను తదుపరి విచారణ సమయానికల్లా నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.