సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. డిజెంబర్ 6న యశోద చిత్రీకరణ మొదలుపెట్టాం. 24తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. రావు రమేష్, మురళీ శర్మ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జనవరి 3న రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ చేస్తాం. మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ నిర్విరామంగా జరుగుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దర్శకులు కొత్తవాళ్లు అయినప్పటికీ కాన్ఫిడెంట్గా తెరకెక్కిస్తున్నారు. విజువల్గా, టెక్నికల్గా సినిమా చాలా గ్రాండియర్గా ఉంటుంది. ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు’ అని చెప్పారు.