Telugu Indian Idol : రెట్రో స్పెషల్ లో ‘గీతాంజలి’ పాటలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడిల్ కు క్రేజ్ వారం వారం పెరిగిపోతోంది. మొత్తం పన్నెండు మంది ఫైనలిస్టుల్లో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన పదిమందికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దాంతో న్యాయనిర్ణేతలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలెట్టారు. అదే సమయంలో ప్రాంక్ చేస్తూ, కంటెస్టెంట్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నారు. శుక్రవారం ఐదుగురు కంటెస్టెంట్స్ పాల్గొనగా, శనివారం మిగిలిన ఐదుగురు పాత సినిమా పాటలతో ఆకట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మణిరత్నం ‘గీతాంజలి’ సినిమాలోని పాటలను పాడగా, మరొకరు మణిరత్నం ‘దొంగ దొంగ’లోని పాట పాడారు. మిగిలిన ఇద్దరూ వంశీ ‘ఏప్రిల్ 1 విడుదల’లోని గీతాన్ని, సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 369’లోని పాటను పాడారు.
శుక్రవారం చెక్క గుర్రాన్ని వేదిక మీదకు తీసుకొచ్చిన హోస్ట్ శ్రీరామచంద్ర… శనివారం సైకిల్ వెనుక నిత్యామీనన్ ను ఎక్కించుకుని స్టేజ్ మీద చక్కర్లు కొట్టాడు. తీరా చూస్తే దానిని ఓ డ్రీమ్ గా చూపించారు. తన కల ఎప్పటికైనా నిజం అవుతుందని నమ్ముతున్నానంటూ సరదాగా ఈ ఎపిసోడ్ ను శ్రీరామచంద్ర ప్రారంభించాడు. ఇక శనివారం మొదటగా ప్రణతి ‘గీతాంజలి’లోని ‘జల్లంత కవ్వింత కావాలిలే… ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే’ గీతాన్ని పాడింది. అయితే ఇళయరాజా స్వరాలకు సొంత రాగాలూ చేర్చడం అస్సలు ఏ మాత్రం బాలేదని ముగ్గురు న్యాయనిర్ణేతలు అనేయడంతో ప్రణతి కంగుతింది. కన్నీళ్ళు పెట్టుకుంది. అదే సమయంలో ఇదంతా ప్రాంక్ అంటూ నిత్యామీనన్ చెప్పేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఆమెది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ అభినందించారు న్యాయనిర్ణేతలు. అంతకు మించి అన్నట్టుగా ‘గీతాంజలి’ మూవీలోని ఓ సన్నివేశాన్ని ప్రణతి… మరో కంటెస్టెంట్ జయంత్ తో కలిసి రీ-క్రియేట్ చేసింది. బిర్యానీ తనకు ఉంచకుండా తీసేశారంటూ ఆరోపించడంతో వేదికపై నవ్వుల పువ్వులు పూశాయి. ఈ సందర్భంగా ప్రణతి ట్రైనర్ నిహాల్ ను కూడా జడ్జీలు అభినందించారు.
Also Read
సెకెండ్ కంటెస్టెంట్ మారుతి ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలోని ‘చుక్కలు తెమ్మన్నా తీసుకురానా’ పాటను పాడాడు. అయితే అది జస్ట్ ఓకేలా ఉందని, అప్ టూ ద మార్క్ లేదని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వాగ్దేవి ‘దొంగ దొంగ’ సినిమాలోని ‘కొంచె నీరు కొంచెం నిప్పు’ పాట పాడింది. ఆమెది బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు జడ్జీలు. ఆ తర్వాత తిరుపతి నుండి వచ్చిన మాన్య ‘ఆదిత్య 369’లోని ‘జాణవులే… నెర జాణవులే’ పాటను పాడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజారిగా పనిచేస్తున్న తన తండ్రికి వారసత్వంగా లభించిన ఆ పూజాది కార్యక్రమాలను ముగ్గురూ ఆడపిల్లలు అయిన కారణంగా తాము కొనసాగించలేక పోతున్నామని వాపోయింది మాన్య. అయితే వేంకటేశ్వరుని సన్నిధిలో తనతో పాటలు పాడించాలన్నది తన తండ్రి కోరిక అని తెలిపింది. ఆ తర్వాత అదితి భావరాజు ‘గీతాంజలి’ మూవీలోని ‘రోజాలో లేత వన్నెలే’ పాటను పాడి ఆకట్టుకుంది. ఆమెను కూడా తొలుత ప్రాంక్ చేసి ఏడిపించిన జడ్జీలు ఆ తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ ఫెర్ఫార్మెన్స్ అంటూ మెచ్చుకోవడంతో కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. యోగా చేయడం తనకు ఇష్టమని అదితి చెప్పడంతో మారుతితో కొన్ని యోగాసనాలను చేయించారు. ఇక ఎపిసోడ్ చివరగా ‘గీతాంజలి’లోని పాటను శ్రీరామచంద్ర, కార్తీక్ పాడి… మణిరత్నం, ఇళయరాజా మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ రెట్రో స్పెషల్ ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా అదితి భావరాజు గిఫ్ట్ హ్యాంపర్ అందుకుంది.
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?