ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడిల్ కు క్రేజ్ వారం వారం పెరిగిపోతోంది. మొత్తం పన్నెండు మంది ఫైనలిస్టుల్లో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన పదిమందికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దాంతో న్యాయనిర్ణేతలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలెట్టారు. అదే సమయంలో ప్రాంక్ చేస్తూ, కంటెస్టెంట్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నారు. శుక్రవారం ఐదుగురు కంటెస్టెంట్స్ పాల్గొనగా, శనివారం మిగిలిన ఐదుగురు పాత సినిమా పాటలతో ఆకట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మణిరత్నం ‘గీతాంజలి’…