మాస్ మహారాజ్ రవితేజ నిర్మాత గా మారిన విషయం అందరికి తెలిసిందే. దీని కోసం అతడు ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను కూడా స్థాపించాడు.తన ప్రతి సినిమా కు కూడా ఈ బ్యానర్ ను సహ-నిర్మాత గా అయితే యాడ్ చేస్తున్నాడు. మరోవైపు ఓ కొత్త టీమ్ ను కూడా ఆయన పెట్టుకున్నట్లు సమాచారం..వాళ్లు రక రకాల కథలు విని, అందులోంచి మంచి స్టోరీస్ సెలక్ట్ చేస్తారని సమాచారం. రవితేజ కూడా ఆ కథను విని నచ్చితే నిర్మించేందుకు సిద్ధం అవుతాడని తెలుస్తుంది.అలా ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై వరుస సినిమాలు వస్తున్నాయి.ఇప్పటికే ఈ బ్యానర్ పై మట్టికుస్తీ అనే సినిమా కూడా వచ్చిన విషయం తెలిసిందే.. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఆ సినిమాకు యావరేజ్ టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆర్టీ టీమ్ వర్క్స్ పై మరో సినిమా రెడీ అయినట్లు సమాచారం.. ఈ సినిమా పేరు సుందరం మాస్టర్.
వైవా హర్ష మరియు దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో కళ్యాణ్ సంతోష్ దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు.సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథ ఇది.. తను ఒక గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ ను బోధిస్తుంటాడు. అయితే మిర్యాలమెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్గా వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.అందులో అన్ని వయసులవారు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి విద్యార్థులుగా అయితే వస్తారు. మరి సుందరం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్ను బోధించాడు అనేది సినిమా కథ అని తెలుస్తుంది.సుధీర్ కుమార్ కుర్రు తో కలిసి రవితేజ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను కూడా చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమా కు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను విడుదల తేదీ త్వరలోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం.రవితేజ కు కథ నచ్చితే సినిమాను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.