Rashmika Mandanna : క్రేజీ ఆఫర్… ‘యానిమల్’ వరల్డ్ లో నేషనల్ క్రష్

Rashmika Mandanna

Rashmika Mandanna

ఉగాది సందర్భంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. “యానిమల్” వరల్డ్ లోకి రష్మిక మందన్నను ఆహ్వానిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు ‘యానిమల్’ మేకర్స్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ డ్రామాలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రాను హీరోయిన్ గా ప్రకటించారు. కానీ పరిణీతి ‘యానిమల్’ నుండి తప్పుకుంది. ఇప్పుడు రష్మిక మందన్నను ఈ సినిమాలో కొత్త కథానాయికగా ఎంచుకున్నారు చిత్ర నిర్మాతలు.

Read Also : Bimbisara : రాకకు ముహూర్తం ఫిక్స్

ఇక హీరోయిన్ విషయమే కాకుండా సినిమా విడుదల తేదీని కూడా ఉగాది పర్వదినం సందర్భంగా వెల్లడించారు. 2023 ఆగస్ట్ 11న మూవీని విడుదల చేయనున్నారు. దీంతో “యానిమల్” షూటింగ్ ను ఈ వేసవిలోనే ప్రారంభించే అవకాశం ఉంది. “యానిమల్‌”ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతానీ సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.