NTV Telugu Site icon

Rashmika Mandanna: ఆ సినిమా కథ నాకు నచ్చలేదు.. కేవలం అతని కోసం ఒప్పుకున్నా..?

Rashmika

Rashmika

Rashmika Mandanna: సినిమా ఇండస్ట్రీలో అన్ని తమకు నచ్చినట్టు చేయలేరు. కొన్నిసార్లు మొహమాటం అడ్డు వస్తుంది.. ఇంకొన్నిసార్లు వారికి కావాల్సినవాళ్ల కోసం చేయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు స్నేహం కోసం చేయాల్సి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో మొహమాటంతో ప్రభాస్ ఎన్నో ప్లాప్ కథలను ఓకే చేశాడని చెప్తారు. తెలిసినవారు వచ్చి కథ చెప్తే వారికి నో చెప్పలేక సినిమాలు చేసి డిజాస్టర్ లు అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక అలానే చాలామంది నటీనటులు.. కొన్నిసార్లు కథ నచ్చకపోయినా కొన్ని కారణాల వలన సినిమాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా రష్మిక కూడా ఒక సినిమాను కథ నచ్చకపోయినా ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పినట్లు చెప్పుకొస్తున్నారు. ఆ సినిమానే ఆడవాళ్లు మీకు జోహార్లు.

శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్‌ ఈ సినిమాను నిర్మించారు. 2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత రష్మిక నుంచి వచ్చిన ఈ సినిమా ఆమెకు పరాజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా గురించి రష్మిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ” ఆడవాళ్లు మీకు జోహార్లు కథ నాకు నచ్చలేదు. కానీ, కిషోర్ తిరుమల కోసం, శర్వా కోసం ఆ సినిమా సైన్ చేశాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వారి కోసం కాదు డబ్బు కోసం ఒప్పుకున్నట్లు చెప్పు అని కొందరు.. సినిమా బావుంది కానీ, ఎందుకో ఆడలేదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.