Rani Mukherjee: స్టార్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. ఇంత బాధను ఎలా భరించిందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rani Mukherjee Reveals Miscarriage of 5-month-old Baby: బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాదానికి సంబంధించిన బాధను తాజాగా బయట పెట్టారు. నిజానికి ఇతర నటీనటులలా కాకుండా రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. అయితే ఈ సారి నటి తన గర్భస్రావం గురించి మొదటిసారిగా బయట పెట్టింది. కోవిడ్ 19 సమయంలో తాను గర్భవతినని, అయితే 5 నెలల పాప గర్భస్రావం అయిందని రాణి ముఖర్జీ చెప్పారు. ఆ బాధాకరమైన రోజులను భరించడం తనకి చాలా కష్టమైందని చెప్పుకొచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2023లో రాణి ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో తాను రెండవసారి తల్లి కాబోతున్నానని సంతోషంగా ఉన్నానని అయితే కానీ ఐదు నెలలకే గర్భస్రావం జరిగిందని ఆమె వెల్లడించింది. రాణి ముఖర్జీ ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్లో ఈ విషయం చెప్పలేదని, ఎందుకంటే సినిమా ప్రమోషన్ కోసమే ఆమె ఇదంతా చెబుతోందని అనుకుంటారని భయపడ్డాను అని అన్నారు.
Tiger Shroff: దిశాతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ‘దిశా ప్రేమలో టైగర్
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
మెల్బోర్న్ వేదికపై రాణి ముఖర్జీ మాట్లాడుతూ, ‘నా జీవితం గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్ సమయంలో కూడా నా బాధను బయటపెట్టలేదని అన్నారు. నా వ్యక్తిగత జీవితాన్ని సినిమాతో ముడిపెట్టి చూసి, ఇదంతా స్ట్రాటజీ కోసమేనని జనాలు అనడం నాకు ఇష్టం లేదు. నేను కోవిడ్ 19 సమయంలో అంటే 2020లో గర్భవతిని అయ్యాను. మేము రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నాము అని సంతోషంగా ఉన్నా కానీ దురదృష్టవశాత్తు నేను నా 5 నెలల పాపను పోగొట్టుకున్నాను, నాకు గర్భస్రావం జరిగింది అని ఆమె అన్నారు. ఇక రాణి ముఖర్జీ నటించిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ 17 మార్చి 2023న విడుదలైంది. నార్వేలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రాణి ముఖర్జీ తల్లి పాత్రను పోషించింది. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ యజమాని ఆదిత్య చోప్రాను రాణి ముఖర్జీ 2014లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాది తర్వాత కూతురు ఆదిరా పుట్టింది. రాణి కుమార్తె ఆదిరా నెలలు నిండకుండానే జన్మించింది. ఈ కారణంగా, ఆదిరా పుట్టినప్పుడు చాలా కాలం పాటు NICU లో ఉంచాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!