Rani Mukherjee: స్టార్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. ఇంత బాధను ఎలా భరించిందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rani Mukherjee Reveals Miscarriage of 5-month-old Baby: బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాదానికి సంబంధించిన బాధను తాజాగా బయట పెట్టారు. నిజానికి ఇతర నటీనటులలా కాకుండా రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. అయితే ఈ సారి నటి తన గర్భస్రావం గురించి మొదటిసారిగా బయట పెట్టింది. కోవిడ్ 19 సమయంలో తాను గర్భవతినని, అయితే 5 నెలల పాప గర్భస్రావం అయిందని రాణి ముఖర్జీ చెప్పారు. ఆ బాధాకరమైన రోజులను భరించడం తనకి చాలా కష్టమైందని చెప్పుకొచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2023లో రాణి ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో తాను రెండవసారి తల్లి కాబోతున్నానని సంతోషంగా ఉన్నానని అయితే కానీ ఐదు నెలలకే గర్భస్రావం జరిగిందని ఆమె వెల్లడించింది. రాణి ముఖర్జీ ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్లో ఈ విషయం చెప్పలేదని, ఎందుకంటే సినిమా ప్రమోషన్ కోసమే ఆమె ఇదంతా చెబుతోందని అనుకుంటారని భయపడ్డాను అని అన్నారు.
Tiger Shroff: దిశాతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ‘దిశా ప్రేమలో టైగర్
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
మెల్బోర్న్ వేదికపై రాణి ముఖర్జీ మాట్లాడుతూ, ‘నా జీవితం గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్ సమయంలో కూడా నా బాధను బయటపెట్టలేదని అన్నారు. నా వ్యక్తిగత జీవితాన్ని సినిమాతో ముడిపెట్టి చూసి, ఇదంతా స్ట్రాటజీ కోసమేనని జనాలు అనడం నాకు ఇష్టం లేదు. నేను కోవిడ్ 19 సమయంలో అంటే 2020లో గర్భవతిని అయ్యాను. మేము రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నాము అని సంతోషంగా ఉన్నా కానీ దురదృష్టవశాత్తు నేను నా 5 నెలల పాపను పోగొట్టుకున్నాను, నాకు గర్భస్రావం జరిగింది అని ఆమె అన్నారు. ఇక రాణి ముఖర్జీ నటించిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ 17 మార్చి 2023న విడుదలైంది. నార్వేలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రాణి ముఖర్జీ తల్లి పాత్రను పోషించింది. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ యజమాని ఆదిత్య చోప్రాను రాణి ముఖర్జీ 2014లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాది తర్వాత కూతురు ఆదిరా పుట్టింది. రాణి కుమార్తె ఆదిరా నెలలు నిండకుండానే జన్మించింది. ఈ కారణంగా, ఆదిరా పుట్టినప్పుడు చాలా కాలం పాటు NICU లో ఉంచాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!