Rani Mukherjee: స్టార్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. ఇంత బాధను ఎలా భరించిందో?
Rani Mukherjee Reveals Miscarriage of 5-month-old Baby: బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాదానికి సంబంధించిన బాధను తాజాగా బయట పెట్టారు. నిజానికి ఇతర నటీనటులలా కాకుండా రాణి ముఖర్జీ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. అయితే ఈ సారి నటి తన గర్భస్రావం గురించి మొదటిసారిగా బయట పెట్టింది. కోవిడ్ 19 సమయంలో తాను గర్భవతినని, అయితే 5 నెలల పాప గర్భస్రావం అయిందని రాణి ముఖర్జీ చెప్పారు. ఆ బాధాకరమైన రోజులను భరించడం తనకి చాలా కష్టమైందని చెప్పుకొచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2023లో రాణి ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో తాను రెండవసారి తల్లి కాబోతున్నానని సంతోషంగా ఉన్నానని అయితే కానీ ఐదు నెలలకే గర్భస్రావం జరిగిందని ఆమె వెల్లడించింది. రాణి ముఖర్జీ ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్లో ఈ విషయం చెప్పలేదని, ఎందుకంటే సినిమా ప్రమోషన్ కోసమే ఆమె ఇదంతా చెబుతోందని అనుకుంటారని భయపడ్డాను అని అన్నారు.
Tiger Shroff: దిశాతో బ్రేకప్ తర్వాత మళ్ళీ ‘దిశా ప్రేమలో టైగర్
Also Read
- Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
- Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
మెల్బోర్న్ వేదికపై రాణి ముఖర్జీ మాట్లాడుతూ, ‘నా జీవితం గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారి, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ ప్రమోషన్ సమయంలో కూడా నా బాధను బయటపెట్టలేదని అన్నారు. నా వ్యక్తిగత జీవితాన్ని సినిమాతో ముడిపెట్టి చూసి, ఇదంతా స్ట్రాటజీ కోసమేనని జనాలు అనడం నాకు ఇష్టం లేదు. నేను కోవిడ్ 19 సమయంలో అంటే 2020లో గర్భవతిని అయ్యాను. మేము రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నాము అని సంతోషంగా ఉన్నా కానీ దురదృష్టవశాత్తు నేను నా 5 నెలల పాపను పోగొట్టుకున్నాను, నాకు గర్భస్రావం జరిగింది అని ఆమె అన్నారు. ఇక రాణి ముఖర్జీ నటించిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ 17 మార్చి 2023న విడుదలైంది. నార్వేలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రాణి ముఖర్జీ తల్లి పాత్రను పోషించింది. అషిమా చిబ్బర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ యజమాని ఆదిత్య చోప్రాను రాణి ముఖర్జీ 2014లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాది తర్వాత కూతురు ఆదిరా పుట్టింది. రాణి కుమార్తె ఆదిరా నెలలు నిండకుండానే జన్మించింది. ఈ కారణంగా, ఆదిరా పుట్టినప్పుడు చాలా కాలం పాటు NICU లో ఉంచాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!