Rana Daggubati: జై భీమ్ వివాదం.. వారు కాంట్రవర్సీ చేశారు.. రానా సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati: యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. రానా గురించి చెప్పాలంటే.. ఎలాంటి విషయాన్ని అయినా ఎలాంటి వివాదంపైన మీడియా ముందు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తన మనసుకి ఏది అనిపిస్తే దాన్ని చెప్పేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు రానా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాలలో ఇరుక్కున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే అందులో కూడా నిజం లేకపోలేదు అనేది చాలామంది వాదన. ఇకపోతే ప్రస్తుతం రానా జాతీయ అవార్డుల విషయంలో ఒక సినిమాకు అన్యాయం జరిగిందని చెప్పకనే చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కోలీవుడ్ సినిమా జై భీమ్ కు అవార్డు రాకపోవడంపై అవమానులు ఎంతటి అసహనాన్ని వ్యక్తం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో అద్భుతమైన సినిమాకు అవార్డు రాకపోవడంతో తామందరం నిరాశ చెందామని చెప్పుకొచ్చారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖులు సైతం ఈ సినిమా విషయంలో బాధపడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముఖ్యంగా హీరో నాని జై భీమ్ కు అవార్డు రాకపోవడంతో తన మనసు ముక్కలవుతున్నట్టు ఎమోజీ పెట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అప్పట్లో నాని ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన విషయం కూడా తెలిసిందే.
SS Rajamouli: రాజమౌళి జాతకంలో బ్యాడ్ లక్.. మహేష్ సినిమా ఇప్పట్లో కష్టమే..?
Also Read
- Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
- Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. 'బిల్లా రంగ బాషా' నుంచి బిగ్ అప్డేట్!
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ఇక తాజాగా ఈ వివాదంపై రానా.. సైమా అవార్డుల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో స్పందించాడు. సినిమాల విషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవని, నటీనటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని చెప్పుకొచ్చాడు. “కొంతమందికి ఒక సినిమా నచ్చుతుంది.. కొంతమందికి అదే సినిమా నచ్చకపోవచ్చు.. నటుల అభిరుచులు కూడా అలాగే ఉంటాయి. అంత ఎందుకు ఈ మధ్య జై భీమ్ కు జాతీయ అవార్డు వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ, అది ఎంపిక కాలేదు. దీంతో చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంలో కొంతమంది కాంట్రవర్సీ చేశారు.. ఇంకొంతమంది కేవలం ట్వీట్ మాత్రమే చేశారు. కాంట్రవర్సీ చేసే వాళ్ళు కాంట్రవర్సీ చేశారు. నార్మల్ ట్వీట్ వేసేవాళ్ళు నార్మల్ ట్వీట్ వేశారు” అని రానా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!