Rana Daggubati: జై భీమ్ వివాదం.. వారు కాంట్రవర్సీ చేశారు.. రానా సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati: యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. రానా గురించి చెప్పాలంటే.. ఎలాంటి విషయాన్ని అయినా ఎలాంటి వివాదంపైన మీడియా ముందు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తన మనసుకి ఏది అనిపిస్తే దాన్ని చెప్పేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు రానా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాలలో ఇరుక్కున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే అందులో కూడా నిజం లేకపోలేదు అనేది చాలామంది వాదన. ఇకపోతే ప్రస్తుతం రానా జాతీయ అవార్డుల విషయంలో ఒక సినిమాకు అన్యాయం జరిగిందని చెప్పకనే చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కోలీవుడ్ సినిమా జై భీమ్ కు అవార్డు రాకపోవడంపై అవమానులు ఎంతటి అసహనాన్ని వ్యక్తం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో అద్భుతమైన సినిమాకు అవార్డు రాకపోవడంతో తామందరం నిరాశ చెందామని చెప్పుకొచ్చారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖులు సైతం ఈ సినిమా విషయంలో బాధపడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముఖ్యంగా హీరో నాని జై భీమ్ కు అవార్డు రాకపోవడంతో తన మనసు ముక్కలవుతున్నట్టు ఎమోజీ పెట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అప్పట్లో నాని ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన విషయం కూడా తెలిసిందే.
SS Rajamouli: రాజమౌళి జాతకంలో బ్యాడ్ లక్.. మహేష్ సినిమా ఇప్పట్లో కష్టమే..?
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో 'జీ5' సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ఇక తాజాగా ఈ వివాదంపై రానా.. సైమా అవార్డుల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో స్పందించాడు. సినిమాల విషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవని, నటీనటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవని చెప్పుకొచ్చాడు. “కొంతమందికి ఒక సినిమా నచ్చుతుంది.. కొంతమందికి అదే సినిమా నచ్చకపోవచ్చు.. నటుల అభిరుచులు కూడా అలాగే ఉంటాయి. అంత ఎందుకు ఈ మధ్య జై భీమ్ కు జాతీయ అవార్డు వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ, అది ఎంపిక కాలేదు. దీంతో చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంలో కొంతమంది కాంట్రవర్సీ చేశారు.. ఇంకొంతమంది కేవలం ట్వీట్ మాత్రమే చేశారు. కాంట్రవర్సీ చేసే వాళ్ళు కాంట్రవర్సీ చేశారు. నార్మల్ ట్వీట్ వేసేవాళ్ళు నార్మల్ ట్వీట్ వేశారు” అని రానా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!