Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్తో గేమ్ ఛేంజర్.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న సలార్తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ వైరల్గా మారింది. సలార్తో పోటీపడి డుంకీ నెగ్గుతుందో? లేదో? తెలియదు గానీ.. రాజ్ కుమార్ మార్క్ ఫిల్మ్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోతుంది. ఇప్పటి వరకు ఈయన చేసింది కేవలం ఐదు సినిమాలు మాత్రమే. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు.. ఈ సినిమాలన్నీ డబుల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నెక్స్ట్ షారుఖ్ ఖాన్తో డుంకీ గా రాబోతున్నాడు. అలాంటి డైరెక్టర్తో చరణ్ సినిమా అనేది లేటెస్ట్ టాక్.
Leo: త్రిష ఫస్ట్ లుక్ ఇలా రిలీజ్ చేశారేంటి గురూ?
తాజాగా ముంబైలో అయ్యప్ప దీక్షను విరమించిన చరణ్.. ఆ తర్వాత ఎంఎస్ ధోనిని కలిశాడు. ఇదే సమయంలో రాజ్ కుమార్ హిరాణీని కూడా కలిశాడట చరణ్. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయనేది బాలీవుడ్ వర్గాల మాట. రాజ్ కుమార్, చరణ్కు స్క్రిప్ట్ నేరేట్ చేశాడని.. కుదిరితే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. కానీ రాజ్ కుమార్ చాలా స్లోగా సినిమాలు చేస్తారు. ఇరవై ఏళ్ల కెరీర్లో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడంటే.. హిరాణీ ఎంత పర్ఫెక్ట్గా సినిమాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. ఈ కాంబో సెట్ అవాలంటే చాలా సమయం పట్టనుంది. అన్నట్టు.. ఆ మధ్య ప్రభాస్తో కూడా రాజ్ కుమార్ హిరాణీ సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలొచ్చాయి. ఇక ఇప్పటికే చరణ్ కు ఆర్ఆర్ఆర్ తరువాత బాలీవుడ్ లో ఓ రేంజ్ గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా కనుక ఓకే అయితే బాలీవుడ్ లో చరణ్ గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్.. అంటే అన్నారు కానీ, ఆ ఊహ ఎంత బావుందో.. ? .. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.