Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ దీనికి బ్రేక్ ఇచ్చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మే 9న లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్ దంపతులు పాల్గొంటారు. ఆ తర్వాత మే11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ రాయల్ ఫిల్హార్మోనిక్ లైవ్ కన్సర్ట్లోనూ చరణ్ పాల్గొంటారు. ఈ రెండు ప్రోగ్రామ్స్ కోసం ఆయన లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు.
Read Also : Appanna Temple Incident : అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి
ఈ రెండింటి తర్వాత ఆయన మే 14నుంచి పెద్ది మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఈ షూటింగ్ ను ఉత్తరాది జిల్లాల్లో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ కొంత వరకు పూర్తి అయింది. మిగతా షెడ్యూల్ ను ఏపీలోనే కోస్తాంధ్ర జిల్లాల్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో రామ్ చరణ్ పెద్ది పాత్రలో ఫుల్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో భావోద్వేగాల సీన్లలో మూవీని తీస్తున్నాడు బుచ్చిబాబు. ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also : Sritej: సంధ్యా థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీ తేజ డిశ్చార్జ్