అరవింద్ కే ఝలక్ ఇచ్చిన ‘నాయట్టు’ నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొట్టివాడైనా గట్టివాడు అంటుంటారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని. ఏది చేసినా పక్కా ప్లానింగ్ తో చేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అలాంటి అరవింద్ ని కూడా బురిడీ కొట్టించారు మలయాళ నిర్మాతలు. మలయాళంలో గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘నాయట్టు’. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రంజిత్, శశిధరన్ తో కలసి దర్శకుడు మార్టిన్ ప్రకట్ నిర్మించారు. చిన్న పాయింటు చుట్టూ ఆసక్తికరమైన కథను అల్లుకుని చేసిన ఈ సినిమా ఇది. హత్యానేరంలో ఇరుక్కున్న పోలీసులను పోలీసులే వెంటాడటం అనే పాయింట్ తో రూపొందించిన చిత్రమిది.
ఇటీవల కాలంలో మలయాళ సినిమాలను కొని తమ ఆహా కోసం డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ వస్తున్నారు అరవింద్. అలా ఈ ‘నాయట్టు’ సినిమా డబ్బింగ్ హక్కులు కూడా తీసుకుంది ఆహా సంస్థ. అయితే ఈ సినిమా విజయం సాధించటంతో తెలుగులో రీమేక్ చేయాలని భావించారు అరవింద్. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు తెలియచేయటంతో ఎలాగూ డబ్బింగ్ హక్కులు ఆహా వద్దే ఉన్నాయి కదా… ప్రొసీడ్ అని చెప్పటంతో దర్శకుడుగా ‘పలాస’ కరుణ్ కుమార్ ని ఎంపిక చేసుకుని ప్రధాన పాత్రలకు రావు రమేశ్, అంజలి, ప్రియదర్శిని ఎంపిక చేసుకుని పూజతో మొదలెట్టేశారు. ఆర్టిస్ట్ ల డేట్స్ తీసుకుని ఇక రెగ్యులర్ షూట్ కు వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో ఒరిజినల్ నిర్మాతలు ఝలక్ ఇచ్చారట. రీమేక్ హక్కుల కోసం భారీ స్థాయిలో డిమాండ్ చేశారట. అప్పటికే ప్రాజెక్ట్ ప్రకటించి ఆరంభించటంతో అడిగినంత ఇస్తారనే ధీమాతో అలా డిమాండ్ చేశారట
దాంతో ఈ ప్రాజెక్టును ప్రస్తుతానికి ఆపేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రీమేక్ రైట్స్ కోసం భారీ మొత్తం వెచ్చిస్తే షూటింగ్ పూర్తయ్యే సరికి దాదాపు 7,8 కోట్లు అవుతుందట.
Also Read
- God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
- Sunil Narang: 'ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి' ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
- Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
నిజానికి ఈ సినిమాను 4 కోట్లలో పూర్తి చేయాలని భావించారు. ఇప్పుడు బడ్జెట్ డబుల్ అవుతుండటంతో ఏకంగా ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేశారట. ఎలాగూ డబ్బింగ్ రైట్స్ తమ వద్దే ఉన్నాయి కాబట్టి డబ్ చేసి ‘ఆహా’లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నటీనటులు కూడా ఈ సినిమాకోసం కేటాయించిన డేట్స్ వేరే వేరే సినిమాలకు ఇచ్చేశారు. దర్శకుడు కూడా కొత్త వారితో ‘పలాస’ తరహాలో సినిమా చేయబోతున్నాడు. సో అల్లు అరవింద్ కే ఝలక్ ఇచ్చారు మలయాళ నిర్మాతలు.
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!