MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన, సంక్రాంతి రాజుగా ఎంఎస్ రాజు అందరికి సుపరిచితులు. త్రిషను టాలీవుడ్లో టాప్ లీగ్లోకి తీసుకెళ్లిన ఘనత ఎంఎస్ రాజుదే. ‘వర్షం’ సినిమాతో ఆమెకు లైఫ్ ఇచ్చిన రాజు.. తాజాగా ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో త్రిష తన గురించి చెప్పిన ఒక క్రేజీ సీక్రెట్ను, అలాగే తనపై ఆమెకున్న ప్రాణప్రదమైన అభిమానాన్ని ఎమోషనల్గా వివరించారు.
ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ‘ఆమెకు నేనంటే ప్రాణం, నన్ను దేవుడిలా చూసుకుంటుంది. ఒకసారి ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక వాళ్లు త్రిషను ఇంటర్వ్యూ చేస్తూ.. ‘రాత్రి 3 గంటల సమయంలో మీకు ఏదైనా సమస్య వస్తే, ఎవరికి ఫోన్ చేసి మాట్లాడటానికి కంఫర్ట్గా ఫీల్ అవుతారు?’ అని ప్రశ్నించారు. దానికి ఆమె వెనుకాడకుండా ‘ఓన్లీ ఎంఎస్ రాజు గారు’ అని సమాధానం ఇచ్చింది. నాపై ఆమెకు అంతటి నమ్మకం, అభిమానం ఉన్నాయి’ అని తెలిపారు. త్రిషకు ‘వర్షం’ సినిమాలో అవకాశం రావడం వెనుక ఉన్న ఆసక్తికర కథను రాజు గారు బయటపెట్టారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘అర్జున్’ సినిమా కోసం మొదట త్రిషను అనుకున్నారట. కానీ ఆ క్యారెక్టర్కు సెట్ కాదని రిజెక్ట్ చేశారు..
Also Read
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
అయితే ‘ఆ ఫోటోలు మహేష్ బాబు దగ్గర చూసి.. ‘ఈ అమ్మాయి బాగుంది కదా బాబు, నేను నా సినిమాలో పెట్టుకోవచ్చా?’ అని అడిగాను. ఆయన పెట్టుకోమన్నారు. నేను ఫోన్ చేయగానే త్రిష, వాళ్ల అమ్మగారు ఎంతో ఎక్సైట్ అయ్యారు. చెన్నై వెళ్లి ఆమెను ఫైనల్ చేశాను. ‘వర్షం’ సినిమా కోసం ఆ అమ్మాయి ఏకంగా 75 రోజులు వానలో తడిసింది. కొన్ని కష్టమైన యాక్షన్ సీక్వెన్స్, రైలులోంచి దూకే సీన్లు చేయలేక ఏడ్చేసేది. ‘చేయలేకపోతే వెళ్ళిపో’ అని నేను గద్దించేవాడిని.. అయినా పట్టుదలగా చేసి చూపించింది. అప్పటినుంచి ఆమె మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది’ అని రాజు గారు గుర్తు చేసుకున్నారు.
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు మొదట త్రిషను రిపీట్ చేయకూడదు అనుకున్నారట. కానీ త్రిష ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎంఎస్ రాజు గారి ఇంటికి వచ్చి భోజనం చేసి, తన డేట్స్ డైరీ ఓపెన్ చేసి.. “మీకు ఎప్పుడు డేట్స్ కావాలో రాసుకోండి” అని అడిగిందట. అలా ఏ హీరో, హీరోయిన్ అడగరని ఆయన కొనియాడారు. ప్రస్తుతం సూర్య ‘వీరభద్రుడు’ (కరుప్పు) సక్సెస్తో జోష్లో ఉన్న త్రిష గురించి ఎంఎస్ రాజు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!