Popular Singer Vaddepalli Srinivas Passed Away Due to Illness: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ సినీ జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ అనూహ్యంగా కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని తన స్వగృహంలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకి వెల్లడించారు.అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణ వార్తతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలోనే కాదు జానపద కళాకారులలో కూడా విషాదం నింపింది. సినీ ప్రముఖులు, జానపద కళాకారులు శ్రీనివాస్ కు నివాళులు అర్పిస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Priyadarshi: ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి సినిమా
తన సుధీర్గ కెరియర్లో వడ్డేపల్లి శ్రీనివాస్ దాదాపు 100 కి పైగా పాటలు అనేక జానపద గీతాలు పాడారు. అంతేకాదు గజ్జ కట్టి అనేక వేదికల మీద తనదైన ఆటపాటలతో అలరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. 2012 సినిమాలో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోని గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల అనే పాట పాడిన ఆయన ఒక్కసారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక వడ్డేపల్లి శ్రీనివాస్ ఆ సినిమా మాత్రమే కాదు కింగ్, బెంగాల్ టైగర్, నమస్తే అన్న తదితర సినిమాల్లో ఆయన పాటలు పాడారు.