Renukaswamy Case: దర్శన్ ను కలిసి చిక్కుల్లో పడ్డ కమెడియన్?
- రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ & పవిత్ర గౌడ ప్రధాన నిందితులు
- పరప్ప అగ్రహార జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా దర్శన్
- దర్శన్ను కలిసేందుకు జైలుకు వెళ్లిన నటుడు చిక్కన్నకు కొత్త చిక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Will Be Serve Notice To Actor Chikkanna in Renukaswamy Case: చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ తూగుదీపను కలిసి మాట్లాడిన హాస్యనటుడు చిక్కన్న చిక్కుల్లో పడ్డాడు. ఆయనని మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. రేణుకాస్వామి హత్యకు ముందు జూన్ 8న దర్శన్తో పాటు కేసులో నిందితులు ఆర్ఆర్నగర్లోని స్టోనీ బ్రూక్ పబ్లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నటుడు చిక్కన్న కూడా పాల్గొనడంతో పోలీసులు అతడిని ముందుగా పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. అలాగే చిక్కన్న వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట సీఆర్పీసీ 164 కింద నమోదు చేశారు. నటుడు దర్శన్ సహా ఇతర నిందితులపై చిక్కన్న వాంగ్మూలాన్ని ముఖ్యమైన సాక్షిగా పరిగణించాలని పోలీసులు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం దాఖలు చేశారు. భవిష్యత్తులో తన వాంగ్మూలాన్ని మార్చుకుంటే విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున అతని వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట రికార్డ్ చేశారు. అనంతర పరిణామంలో చిక్కన్న పరప్ప అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లి నిందితుడు దర్శన్ను కలిశాడు.
Mia Khalifa: మోసం చేసి పోర్న్ స్టార్ ని చేశాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మియా ఖలీఫా
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
సాధారణంగా కేసు విచారణలో ఉన్న సమయంలో సాక్షి నిందితులను జైలులో కలవరు. అయితే రేణుకాస్వామి హత్య కేసు విచారణలో ఉన్న సమయంలో చిక్కన్న దర్శన్ను కలిశాడు. దీంతో పోలీసులు చిక్కన్నకు నోటీసులిచ్చి విచారించనున్నారు. నిందితుడు దర్శన్ను ఏ ఉద్దేశ్యంతో కలిశారు? నిందితుడితో ఆయన ఏం మాట్లాడాడు? అనే విషయంపై పోలీసులు చిక్కన్నను ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు సాక్షి, నిందితుల మధ్య జరిగిన భేటీకి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు జైలు అధికారుల నుంచి రాబట్టనున్నారు. అలాగే ఈ కేసులోని సాక్షులు దర్శన్ను కలవకుండా అడ్డుకోవాలని సిట్ కోర్టును ఆశ్రయించనుంది. చిక్కన్నతో పాటు ఈ కేసులో సాక్ష్యం చెప్పిన చాలా మంది జైలుకు వెళ్లి దర్శన్ను కలిశారని, వారందరినీ విచారించే ప్రక్రియ మొదలైంది. జైలులో దర్శన్ను కలిసిన వ్యక్తుల సమాచారం సేకరించిన పోలీసులు.. వారందరికీ నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించారు. రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే చార్జిషీటును కోర్టుకు సమర్పిస్తామని నగర పోలీసు కమిషనర్ బి.దయానంద్ తెలిపారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!