Namitha: చీటింగ్ కేసు.. పరారీలో నమిత భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namitha: సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నమిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించినా.. అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారి కోలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ తంబీలకు బొద్దుభామలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో నమితకు గుడి కట్టేసి.. దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఇక అన్ని భాషల్లో నమిత తన సత్తా చాటుతున్న తరుణంలోనే తెలుగు, తమిళ్ నటుడు వీరేంద్ర చౌదరి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం నమిత పిల్లలను చూసుకొనే బాధ్యత తీసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. వీరేంద్ర.. బిజినెస్ లో బిజీగా మారాడు.
Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?
Also Read
- సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
ఇక ఈ నేపథ్యంలోనే వీరేంద్రపై ఒక చీటింగ్ కేసు నమోదయ్యింది. తన వద్ద రూ. 41 లక్షలు తీసుకొని తనను మోసం చేసారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏంటంటే.. వీరేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (MSME)కు ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి లోన్ తీసుకోవాలనుకుంటే కొన్ని సంస్థలు సులభంగా రుణాలను అందిస్తుంటాయి. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తుంటుంది. MSME అలాంటి వారికి లోన్స్ ఇప్పిస్తూ ఉంటుంది. ప్రభుత్వమే దీనిని నడిపిస్తూ ఉంటుంది. ఇక గోపాలస్వామి అనే వ్యక్తి దగ్గర ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు.వారితో పాటు వీరేంద్రకు కూడా భాగం ఉందన్న అనుమానంతో.. ఆయనను విచారించడానికి వీరేంద్రకు నోటీసులు పంపారు. అయితే ఇప్పటివరకు వీరేంద్ర ఎక్కడ ఉన్నాడు అనేది తెలియరాలేదు. మరి ఇందులో అతని హస్తం ఉందా లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!