Namitha: చీటింగ్ కేసు.. పరారీలో నమిత భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namitha: సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నమిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించినా.. అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారి కోలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ తంబీలకు బొద్దుభామలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో నమితకు గుడి కట్టేసి.. దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఇక అన్ని భాషల్లో నమిత తన సత్తా చాటుతున్న తరుణంలోనే తెలుగు, తమిళ్ నటుడు వీరేంద్ర చౌదరి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం నమిత పిల్లలను చూసుకొనే బాధ్యత తీసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. వీరేంద్ర.. బిజినెస్ లో బిజీగా మారాడు.
Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
ఇక ఈ నేపథ్యంలోనే వీరేంద్రపై ఒక చీటింగ్ కేసు నమోదయ్యింది. తన వద్ద రూ. 41 లక్షలు తీసుకొని తనను మోసం చేసారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏంటంటే.. వీరేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (MSME)కు ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి లోన్ తీసుకోవాలనుకుంటే కొన్ని సంస్థలు సులభంగా రుణాలను అందిస్తుంటాయి. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తుంటుంది. MSME అలాంటి వారికి లోన్స్ ఇప్పిస్తూ ఉంటుంది. ప్రభుత్వమే దీనిని నడిపిస్తూ ఉంటుంది. ఇక గోపాలస్వామి అనే వ్యక్తి దగ్గర ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు.వారితో పాటు వీరేంద్రకు కూడా భాగం ఉందన్న అనుమానంతో.. ఆయనను విచారించడానికి వీరేంద్రకు నోటీసులు పంపారు. అయితే ఇప్పటివరకు వీరేంద్ర ఎక్కడ ఉన్నాడు అనేది తెలియరాలేదు. మరి ఇందులో అతని హస్తం ఉందా లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!