Namitha: చీటింగ్ కేసు.. పరారీలో నమిత భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namitha: సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నమిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత వెంకటేష్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించినా.. అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మారి కోలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ తంబీలకు బొద్దుభామలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో నమితకు గుడి కట్టేసి.. దేవతగా పూజించడం మొదలుపెట్టారు. ఇక అన్ని భాషల్లో నమిత తన సత్తా చాటుతున్న తరుణంలోనే తెలుగు, తమిళ్ నటుడు వీరేంద్ర చౌదరి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారి 2017లో తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం నమిత పిల్లలను చూసుకొనే బాధ్యత తీసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. వీరేంద్ర.. బిజినెస్ లో బిజీగా మారాడు.
Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
ఇక ఈ నేపథ్యంలోనే వీరేంద్రపై ఒక చీటింగ్ కేసు నమోదయ్యింది. తన వద్ద రూ. 41 లక్షలు తీసుకొని తనను మోసం చేసారని సేలంకు చెందిన గోపాలస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏంటంటే.. వీరేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (MSME)కు ప్రమోషన్ కౌన్సిల్, తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి లోన్ తీసుకోవాలనుకుంటే కొన్ని సంస్థలు సులభంగా రుణాలను అందిస్తుంటాయి. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తుంటుంది. MSME అలాంటి వారికి లోన్స్ ఇప్పిస్తూ ఉంటుంది. ప్రభుత్వమే దీనిని నడిపిస్తూ ఉంటుంది. ఇక గోపాలస్వామి అనే వ్యక్తి దగ్గర ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు ముత్తురామన్, కార్యదర్శి దుష్యంత్ యాదవ్లు రూ.41 లక్షలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు.వారితో పాటు వీరేంద్రకు కూడా భాగం ఉందన్న అనుమానంతో.. ఆయనను విచారించడానికి వీరేంద్రకు నోటీసులు పంపారు. అయితే ఇప్పటివరకు వీరేంద్ర ఎక్కడ ఉన్నాడు అనేది తెలియరాలేదు. మరి ఇందులో అతని హస్తం ఉందా లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?