Pawan Kalyan: ఒడిశా రైలు ప్రమాదం.. ఎమోషనల్ అయిన జనసేనాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. గతరాత్రి బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో.. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు.. ఒక గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు 237 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 వందల కంటే ఎక్కువమంది క్షతగాత్రులుగా మిగిలారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక లోకల్ హీరోలు.. ఇలాంటి సమయంలో రక్తం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా అందరూ.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ .. ఈ ఘటనపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ట్లు తెలిపారు.
Al Pacino: ప్రేయసి కడుపులో బిడ్డకు డీఎన్ఎ టెస్ట్ చేయించిన 83 ఏళ్ళ నటుడు.. సిగ్గుండాలి
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
“శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం – JanaSena Chief Shri @PawanKalyan #TrainAccident pic.twitter.com/t5aQmYtM3Q
— JanaSena Party (@JanaSenaParty) June 3, 2023
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!