50 ఏళ్ళ ‘పవిత్ర హృదయాలు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటరత్న యన్.టి.రామారావు హీరోగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రం పార్ట్ లీ కలర్ లో రూపొందింది. 1971లో యన్టీఆర్ నటించిన ఎనిమిదవ చిత్రమిది. ఆ యేడాది తెలుగునాట రంగుల చిత్రాల హవా విశేషంగా వీచడం మొదలయింది. ఈ నేపథ్యంలో ‘పవిత్ర హృదయాలు’లో కొన్ని పాటలు రంగుల్లో దర్శనమిచ్చాయి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు చెల్లెలిగా నటించిన చంద్రకళ, ‘మాతృదేవత’ చిత్రంలో కూతురుగానూ అభినయించింది. యన్టీఆర్ సరసన నాయికగా ఆమె తొలిసారి ‘తల్లా?పెళ్ళామా?’లో నటించగా, ఈ ‘పవిత్ర హృదయాలు’ రెండవ చిత్రం. 1971 నవంబర్ 24న ఈ సినిమా విడుదలయింది
‘పవిత్ర హృదయాలు’ కథ విషయానికి వస్తే – భుజంగరావు అనే ఓ జమీందార్ కు ఇద్దరు మనవళ్ళు ఉంటారు. పెద్దవాడు నరేంద్ర బాబు, చిన్నవాడు రవీంద్ర బాబు. ఇద్దరికీ తాత స్వేచ్ఛనిస్తారు. వీరి ఆస్తి కాజేయాలని వీరి సమీపబంధువు శేషగిరి ప్రయత్నిస్తూఉంటాడు. నరేంద్రను వ్యసనాలకు బానిసగా మారుస్తాడు. రవీంద్ర మాత్రం ఓ గాయకునిగా స్థిర పడతాడు. ఒకప్పుడు భుజంగరావు వద్ద పనిచేసే శివయ్య తాగుబోతు. దాంతో అతని పెద్ద కూతురు సుశీల కుటుంబభారం మోస్తూ ఉంటుంది. ఆమె చెల్లెలు విజయ చదువు కుంటుంది. ఓ సందర్భంలో రవీంద్రతో విజయకు పరిచయం అవుతుంది. సుశీలను వారి ఇంటి ఓనర్ పానకాలు సొంతం చేసుకోవాలని చూస్తూంటాడు. అతనిని శివయ్య చావగొడతాడు. జనం సుశీలను నిందిస్తే ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెను నరేంద్ర కాపాడతాడు. ఆమె కారణంగా నరేంద్ర మారిపోతాడు. ఈ లోగా భుజంగరావును ఓ చోట బంధించి, అతని స్థానంలో మరో వ్యక్తిని పెట్టి, ఆటాడిస్తుంటాడు శేషగిరి. ఈ విషయం రవీంద్రకు తెలుస్తుంది. మారు వేషాలు వేసి, చివరకు శేషగిరిని బురిడీ కొట్టిస్తాడు. తమ తాతను విడిపించుకొని, అసలు దోషులను చట్టానికి అప్పగిస్తారు. సుశీలను నరేంద్ర, ఆమె చెల్లెలు విజయను రవీంద్ర పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
ఈ చిత్రంలో రవీంద్రగా యన్టీఆర్, నరేంద్రగా గుమ్మడి, సుశీలగా జమున, విజయగా చంద్రకళ నటించారు. మిగిలిన పాత్రలలో చిత్తూరు నాగయ్య, సత్యనారాయణ, శాంతకుమారి, ధూళిపాల, మద్దినేని, రాజనాల, అల్లు రామలింగయ్య, రాజబాబు, సంధ్యారాణి తదితరులు కనిపించారు. ఈ చిత్రానికి డాక్టర్ సి.నారాయణ రెడ్డి పాటలు రాయగా, టి.చలపతిరావు సంగీతం సమకూర్చారు. ఇందులోని “శరణన్న వారిని కరుణించే తిరుమలవాసా జగదీశా…” పాట భక్తకోటిని అలరించింది. “చిరునవ్వుల చినవాడే…”, “పలికేది నేనైనా…”, “చుక్కల చీర…” పాటలు కలర్ లో చిత్రీకరించారు. “పలికేది నేనైనా…” పాటను ప్రముఖ సంగీత విద్యాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన్న సత్యనారాయణ కలసి పోటీ పడి పాడడం విశేషం. శ్రీవిజయ వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.యస్.రాజు నిర్మించారు. ఈ చిత్రానికి పినిశెట్టి కథను అందించారు.
- Tags
- 50 years
- chandrakala
- gummadi
- Jamuna
- ntr
తాజావార్తలు
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్లోనే ఆ నలుగురు!
-
Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!