పాన్ ఇండియా సినిమాలు.. పరేషాన్ చేస్తున్న థియేటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ స్క్రీన్ హంగామా మొదలైన రెండు వారాలు అవుతున్న ప్రేక్షకులు ఇంకా పూర్తిస్థాయిలో థియేటర్ల బాట పట్టలేకపోతున్నారు. తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్సులు ఓపెన్ అయ్యాయి. ఏపీలోనూ దాదాపుగా అన్ని పర్మిషన్స్ ఉన్న కొన్ని చోట్ల థియేటర్స్ ఓపెన్ కానీ పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేకున్నాను, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లో నడుస్తున్న ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకు విడుదలైన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన మంచి వసూళ్లను రాబట్టుకోలేకపోతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ భయం పాన్ ఇండియా సినిమాలకు కూడా పట్టుకోంది.
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయినా విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాతలకు గుబులు మొదలైన ఆయా సినిమాల దర్శకులపై నమ్మకం, ఆపై ఈ సినిమాల కోసం అభిమానుల ఎదురుచూపుల వల్ల నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి, ప్రేక్షకుల మూడ్ చూస్తోంటే నిర్మాతల్లో మరోసారి ఆందోళన మొదలవుతోంది. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలతో నిర్మాతల్లో మరింత టెన్షన్ మొదలైంది.
Also Read
మరో పరేషాన్ చేసే ముచ్చట ఏంటంటే, ఆయా సినిమాల విడుదల తేదీలకు కూడా మరో పాన్ ఇండియా సినిమాలే పోటీలో ఉండటంతో ఏమి చేయాలనీ పరిస్థితి కనిపిస్తోంది. మరికొందరి వాదన ఏంటంటే ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించేంత గొప్ప సినిమాలు ఏమి రాలేదనేది వారి భావన. ప్రస్తుతం ఓటీటీలకు వెళ్లే సినిమాలను అడ్డుకోవాల్సింది పోయి, బడా సినిమాలు కూడా ఆ బాటలోకి వెళ్లోద్దని నిర్మాతల్లో ఒకరు సూచించారు. ప్రేక్షకునికి సినిమాల విషయంలో ఎంత కష్టంగా వున్నా మొదటి ప్రియారిటీ థియేటరే కానీ, ఓటీటీ కాదని ఆ నిర్మాత చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!