Kangana Ranaut: రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా ఇవాళ ఉదయం నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కంగనా పిలుపునిచ్చారు. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంగనాతోపాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, GIC డైరెక్టర్ బాధావత్ పూర్ణ చందర్ నాయక్ పాల్గొన్నారు. కంగనా రనౌత్ ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేశారు.
Today (22-02-23) Business Headlines: నాకు అనుకూలంగా రాయండి. మరిన్ని వార్తలు