NTV Telugu Site icon

Tollywood – మరోసారి మెగా vs నందమూరి..యాదృచ్చికమే కానీ..

Untitled Design (26)

Untitled Design (26)

టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్ లో నందమూరి, కొణిదల హీరోలు ముందు వరుసలో ఉంటారు. ఇరివురి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా వేరు. అప్పట్లో నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతారణం కనిపించేది. కటౌట్లు, పాలాభిషేకాలు హడావుడి వేర్ లెవల్ లో ఉండేది.

ఇక వారి తర్వాతి తరం jr.ఎన్టీయార్, రామ్ చరణ్ ల సినిమాల రిలీజ్ సమయంలోనూ ఇదే సెలెబ్రేషన్స్ ఉండేవి. ఇదిలా ఉండగా 2016 సెప్టెంబరులో తారక్ నటించిన జనతా గ్యారేజ్ విడుదలై ఆ సంవత్సరం అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. అదే ఏడాది డిసెంబరులో మెగా పవర్ స్టార్ నటించిన ధ్రువ విడుదలై సూపర్ హిట్ సాధించింది. ఇక 2017 సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి , చిరు కమ్ బ్యాక్ ఫిల్మ్ ఖైదీ నం.150 పోటాపోటీగా రిలీజ్ కాగా రెండు సూపర్ హిట్ గా నిలిచాయి.

దాదాపు 8ఏళ్ల గ్యాప్ తర్వాత యాదృచికంగా మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబరులో తారక్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘దేవర పార్ట్-1 రానుంది. ఇక డిసెంబరు లో శంకర్,రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ రానుంది. 2025 సంక్రాంతికి బాలయ్య 109చిత్రం, మెగాస్టార్ విశ్వంభర పోటీ పడనున్నాయి. 2016 ఎలా అయితే నందమూరి – మెగా హీరోల సినిమాలు వచ్చాయో 2024-25 లోకూడా అలాగే రావడం యాదృచ్చికమే కానీ ఫాన్స్ కు మాత్రం పండగ అనే చెప్పాలి.