NTV Telugu Site icon

Guntur Kaaram: ఇద్దరు హీరోయిన్లు అన్నారు… ఒకరే కనిపిస్తున్నారు ఏంటి?

Guntu Kaaram

Guntu Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత కలిసి చేస్తున్న మూవీ గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచి హైప్ భారీగా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా… ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో హీరోయిన్ల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అయితే గుంటూరు కారం సినిమాలో ముందూ ఇద్దరు హీరోయిన్లే, ఇప్పుడూ ఇద్దరు హీరోయిన్లే… కానీ ప్రమోషన్స్ లో మాత్రం ఒకరే కనిపిస్తున్నారు. గుంటూరు కారం నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో మహేష్ బాబు, శ్రీలీల తప్ప మీనాకి చౌదరి కనిపించట్లేదు. ఓ మై బేబీ, కుర్చీని మడతపెట్టి సాంగ్ లో కూడా శ్రీలీలనే కనిపిస్తోంది కానీ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఒక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాలేదు.

గుంటూరు కారం మేకర్స్ కనీసం మీనాక్షి చౌదరి పాత్రకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సాంగ్స్ అన్ని శ్రీలీల తోనే ఉంటే… మీనాక్షీ కేవలం చిన్న పాత్రకే పరిమితమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు మీనాక్షీ సినిమాలో ఉందా…? కొంపతీసి మహేష్ కు ఏమైనా చెల్లిగా చేస్తుందా..? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే… ఈ మధ్యకాలంలో మీనాక్షీ సోషల్ మీడియా క్రష్ గా మారిపోయింది. ఇక గుంటూరు కారం లో మీనాక్షీ సెకండ్ హీరోయిన్ అనేసరికి మరింత హైప్ వచ్చింది. మరి ఈ చిన్నదాన్ని ఎందుకు టీమ్ ఇంకా బయటపెట్టడం లేదు..? లేక సర్ ప్రైజ్ గా ఉంచుతున్నారా..? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.