Adipurush: మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిపురుష్ సినిమాకు వివాదాలు కొత్త కాదు. ఈ సినిమా స్టార్ట్ అయిప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తునే ఉంది. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ విమర్శలకు చెక్ పెట్టేసింది. టీజర్తో వచ్చిన గ్రాఫిక్స్ నెగెటివిటీని దూరం చేయడంతో పాటు.. సినిమాపై అంచనాలని కూడా పెంచేసింది. ఈ విషయంలో మేకర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ ట్రెండింగ్లో ఉంది. దాంతో డైరెక్టర్ ఓం రౌత్.. యే దోస్తీ అంటూ ప్రభాస్తో కలిసి ఉన్న ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసుకున్నాడు. అందులో పక్క పక్కనే 3డి గ్లాసెస్ పెట్టుకొని ట్రైలర్ చూస్తున్నారు ఇద్దరు. ఈ సందర్భంగా ఆదిపురుష్ ట్రైలర్ రెస్పాన్స్కి అందరికీ థాంక్స్ చెప్పాడు. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ పై మరో కొత్త వివాదం తగులుకుంది. ఈ సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులో.. సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ బాంబే హైకోర్టు న్యాయవాది ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా ఫిర్యాదు చేశారు.
Read Also: CM Jaganmohan Reddy Live: కావలిలో సీఎం జగన్ బహిరంగసభ
Also Read
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
ఆదిపురుష్ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ముందే స్పెషల్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించాలని, సెన్సార్ షిప్ నిర్వహించాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. ఇప్పటికే ‘ఆదిపురుష్’ మేకర్స్ పోస్టర్స్, టీజర్లో చేసిన మిస్టేక్స్ సినిమాలో కూడా ఉంటే, సనాతన ధర్మానికి చెందిన వ్యక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే సినిమా రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా సెన్సార్ షిప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే… గతంలో ఆదిపురుష్ పై విమర్శలు చేసిన మధ్యప్రదేశ్ హోంమంత్రి సైతం ట్రైలర్ చూసి ప్రశంసించారు. పైగా సెన్సార్ అయిన తర్వాతే సినిమా థియేటర్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫిర్యాదులు అనవసరం అనేది.. నెటిజన్స్ టాక్. మరి జూన్ 16న ఆదిపురుష్ ఏం చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!