ప్రకాశ్రాజ్, నవీన్చంద్ర, కార్తీక్రత్నం కీలకపాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభం అయింది. శ్రీ, కావ్య సమర్పణలో ఈ చిత్రాన్ని థింక్ బిగ్ పతాకంపై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్. విజయ్, ప్రకాశ్రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్రాజ్, శ్రీ షిరిడిసాయి మూవీస్ పై యం. రాజశేఖర్ రెడ్డి, శ్రీక్రియేషన్స్పై బి.నర్సింగరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వాలీ మోహన్దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తనికెళ్ల భరణి పూజతో సినిమా ప్రారంభం అయ్యింది. దర్శకుడు వేగేశ్న సతీష్,రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకులు ఆర్.పి పట్నాయక్ చేతుల మీదుగా స్క్రిప్ట్ను దర్శకుడు వాలీ, నిర్మాతలు విజయ్, రాజశేఖర్ అందుకున్నారు. నవీన్చంద్ర, కార్తీక్ రత్నంపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు నటుడు అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్కు ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు.
కథను నమ్మి తనతో ట్రావెల్ చేయటానికి ముందుకొచ్చిన ప్రకాశ్రాజ్, ఏ.ఎల్ విజయ్, నవీన్చంద్ర కు నిర్మాత రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కథతో నిజ జీవితంలో ఎంతో మంది స్ఫూర్తి చెందుతారని, అలాంటి కథతో వచ్చిన దర్శకుడు వాలీకి అభినందనలు తెలిపాడు నవీన్ చంద్ర. తను నటించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ ను రాజశేఖర్ రెడ్డి తమిళంలో ‘కేరాఫ్ కాదల్’గా తీసి తనను తమిళ ఆడియన్స్ కు పరిచయం చేశారని కార్తీక్ రత్నం చెప్పాడు. కథ నచ్చి సినిమాలో భాగం అయ్యానని ఎ.ఎల్. విజయ్ తెలిపాడు. ప్రారంభోత్సవంలో నిర్మాత బి.నర్సింగరావు, నటుడు రాజారవీంద్ర, దర్శకుడు శ్రీపురం కిరణ్, ‘గుణ 369’ ఫేమ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల, దర్శకుడు గౌతమ్ పట్నాయక్ కూడా పాల్గొన్నారు. వాణీబోజన్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించే ఈ చిత్రానికి శివమల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
